Begin typing your search above and press return to search.

అడివి శేష్.. ఆ మాటతో తికమక!

ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉండే శేష్​ తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:45 PM GMT
అడివి శేష్.. ఆ మాటతో తికమక!
X

టాలీవుడ్​లో ప్రస్తుతం థ్రిల్లర్‌ సినిమాల కేరాఫ్​ అడ్రెస్​ హీరో అడివి శేష్. ఈ టాలెంటెడ్​ హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే.. అది పక్కా ఏదో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్. అందరినీ తికమకలో పడేసింది. చాలా మంది అసలు ఆయన ఎందుకు, ఎవరిని ఉద్దేశించి పెట్టారు అని ఆలోచిస్తున్నారు.

వివరాళ్లోకి వెళితే.. ఓ వైపు హీరోగా, మరోవైపు రచయిత, దర్శకుడిగా రాణిస్తున్న నటుల్లో అడివి శేష్‌ ఒకరు. చిత్ర పరిశ్రమలో గాడ్‌ఫాదర్‌ లేకుండా యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్​తో అమెరికా నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగారు.

కెరీర్​ ప్రారంభంలో సహాయనటుడిగా, విలన్‌ పాత్రలు పోషించారు. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో గూఢచారి, ఎవరు వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లలో నటించి ఆకట్టున్నారు.

అలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గతేడాది ద్వితియార్థంలో మేజర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో సక్సెస్​ అందుకున్నారు. అదే ఏడాది చివర్లో హిట్టు-2తో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ప్రస్తుతం గూడచారి 2 సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంటూనే ఇతర సినిమాల కథల మీద చర్చలు జరుపుతున్నారు.

ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉండే శేష్​ తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఎంత వచ్చిందో ముఖ్యమే అన్నయ్యా.. కానీ ఎంత బాగుందనేది అంతకన్నా ముఖ్యం. అని వ్యాఖ్య రాసుకొచ్చారు. మరి ఎవరిని ఉద్దేశించి, ఎందుకు పెట్టారో తెలియలేదు. దీంతో దీని వెనక కారణం ఏమై ఉంటదా అని ఆరాతీస్తున్నారు.

అయితే హాయ్​ నాన్న మూవీ టీజర్ ఈవెంట్​ ప్రెస్ మీట్​లో నానితో ఓ విలేకరి.. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్​ తక్కువ వచ్చాయి అంట కదా అని ప్రశ్నించగా.. నాని అసహనం వ్యక్తం చేశారు. బహుశా అడివిశేష్ ఆ ప్రశ్నకు​ సమాధానం ఇచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు.