Begin typing your search above and press return to search.

గూఢచారి 2: ఈసారి అంతకుమించిన ప్లాన్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అడవి శేష్ ఓ వైపు రైటర్ గాను మరోవైపు హీరోగానూ మంచి సక్సెస్ తో దూసుకెళ్తున్నారు

By:  Tupaki Desk   |   11 Dec 2023 7:34 AM GMT
గూఢచారి 2: ఈసారి అంతకుమించిన ప్లాన్స్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అడవి శేష్ ఓ వైపు రైటర్ గాను మరోవైపు హీరోగానూ మంచి సక్సెస్ తో దూసుకెళ్తున్నారు. గతేడాది మేజర్, హిట్2 లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం గూఢచారి సినిమాకు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే.

G2 అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్, ప్రీ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. 4-5 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందట.

ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్ తో మేకర్స్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో పాటు ఇతర లేటెస్ట్ టెక్నాలజీలను మేకర్స్ ఉపయోగిస్తున్నారట. రూ.80 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ హంగులను చూపించబోతున్నారట. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో 5 అంతస్తుల అద్దాల సెట్‌ను కూడా నిర్మించారట. అందులో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.

ఇక గూఢచారి విషయానికొస్తే.. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. అవుట్ అండ్ అవుట్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ సరసన శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు గూఢచారి సీక్వెల్ G2 ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. హాలీవుడ్ బ్యూటీ బనితా సంధు హీరోయిన్ గా కనిపించనున్నారు.

ఇక గూడచారి కథ మొత్తం ఇండియాలోనే ఉంటుంది. కానీ ఈ సీక్వెల్లో కథ మొత్తం ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండనుంది. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన కొన్ని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ సీక్వెల్లో కనిపించనున్నాయి. ఇక ఈ సీక్వెల్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి.