బాలయ్యను ఫిదా చేసిన అజిత్ డైరెక్టర్?
ఇటీవలే బాలయ్యను కలిసిన అధిక్ రవిచంద్రన్ ..హీరో బాలయ్యకు సరిపడే కథని చెప్పాడని, అది బాలయ్యను ఫిదా చేసిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన
By: Tupaki Desk | 13 May 2025 10:30 PMతమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెలుగు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లన్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. దీనికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలై తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నిర్మాతలకు భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. ఈ మూవీ ఫ్రాఫిట్స్ని అందించిన నేపథ్యంలో హీరో అజిత్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్కు మరో ఆఫర్ ఇచ్చారట.
మంచి కథతో వస్తే కలిసి మరో సినిమా చేద్దామని చెప్పారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చులు జరుగుతున్నాయి. అజిత్ తరహాలోనే మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అన్నీ కుదిరితే అజిత్తో మరో సినిమాని చేయడానికి మేం రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెలుగు హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలయ్య.
ఇటీవలే బాలయ్యను కలిసిన అధిక్ రవిచంద్రన్ ..హీరో బాలయ్యకు సరిపడే కథని చెప్పాడని, అది బాలయ్యను ఫిదా చేసిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తమిళ మడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ బాలయ్య మాస్ పల్స్కు తగ్గ కథని అధిక్ రెడీ చేస్తాడా అన్నదే ఇక్కడ బిగ్ టాస్క్. ఎందుకంటే అతను రూపొందించిన మార్క్ ఆంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.
అతను కథను, కథలోని పాత్రలని చూపించే విధానం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ నెరేషన్ మన వాళ్లకు పెద్దగా ఎక్కదు. అలాంటి అధిక్తో బాలయ్య సినిమా అంటే సాహసమే అని చెప్పాలి. మరి అంతా భావిస్తున్నట్టుగానే అధిక్ రవిచంద్రన్తో సినిమాకు సై అంటాడా? లేక ఇది ఒట్టి రూమరేనా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2'లో నటిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న నాలుగవ సినిమా ఇది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ని సొంతం చేసుకున్న ఈ కాంబినేషన్ ఈ మూవీతో సెకండ్ హ్యాట్రిక్కి నాందిపలుకుతారో చూడాలి.