Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ - అదాశర్మ... పుకార్లకు క్లారిటీ

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అదాశర్మ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు నాకు దేవాలయం తో సమానం.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:29 PM GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ - అదాశర్మ... పుకార్లకు క్లారిటీ
X

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పూత్‌, అదాశర్మ లకు సంబంధించిన పుకార్లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.. అసలు విషయం ఏంటి అంటే సుశాంత్ సింగ్ రాజ్ పూత్‌ కి చెందిన ఇంటిని అదా శర్మ ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ముంబై మకాం మార్చేందుకు గాను ఆ ఇంటిని తక్కువ రేటుకు వస్తున్న కారణంగా కొనుగోలు చేసింది అనేది పుకారు.

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అదాశర్మ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఉంటున్న ఇల్లు నాకు దేవాలయం తో సమానం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఒక వేళ తాను మకాం మార్చాలని భావిస్తే తప్పకుండా మీ అందరికీ చెప్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

షూటింగ్స్ కోసం ఎక్కడికి వెళ్లినా కూడా తిరిగి నా సొంతం ఇంటికి చేరుకుంటాను. నా చిన్నతనం నుంచి ఆ ఇంటితో నాకు ఎటాచ్మెంట్‌ ఉంది. కనుక ఆ ఇంటిని వదిలేయను అంది. అదే సమయంలో తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా వారు చూపిస్తున్న అత్యుత్సాహంపై సున్నితంగా అదా శర్మ విమర్శలు చేసింది. తనకు ప్రైవేట్‌ లైఫ్‌ ఉందంటూ మీడియా ను హద్దుల్లో పెట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది.

కేరళ స్టోరీ సినిమా తర్వాత అదా శర్మ కి పాన్‌ ఇండియా క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ఆమె కేరళ స్టోరీ టీమ్‌ తో కలిసి బస్తర్‌ అనే సినిమా ను చేస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలు చాలా ఉంటాయని, వాటి కోసం చాలా కష్టపడుతున్నట్లుగా ఈ సందర్భంగా అదా శర్మ చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాదిలో బస్తర్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.