Begin typing your search above and press return to search.

అక్క‌డ రాశీ చాలా బిజీ గురూ!

టాలీవుడ్ టూ కోలీవుడ్..బాలీవుడ్ రాశీఖ‌న్నా జ‌ర్నీ గురించి తెలిసిందే. తొలుత బాలీవుడ్ లోనే లాంచ్ అయినా అక్క‌డ క‌లిసి రాక‌పోవ‌డంతో టాలీవుడ్ కి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   24 March 2024 7:03 AM GMT
అక్క‌డ రాశీ చాలా బిజీ గురూ!
X

టాలీవుడ్ టూ కోలీవుడ్..బాలీవుడ్ రాశీఖ‌న్నా జ‌ర్నీ గురించి తెలిసిందే. తొలుత బాలీవుడ్ లోనే లాంచ్ అయినా అక్క‌డ క‌లిసి రాక‌పోవ‌డంతో టాలీవుడ్ కి వ‌చ్చింది. అటుపై కొన్నాళ్ల పాటు ఇక్క‌డ అమ్మ‌డు బాగానే రాణించింది. కానీ స‌క్సెస్ లు క‌న్నా వైఫ‌ల్యాలే ఎక్కువ క‌నిపిస్తాయి. అటుపై కోలీవుడ్ లో కూడా ఇదే త‌ర‌హా జ‌ర్నీని కొనసాగించింది. అందం..అభిన‌యంతో అవ‌కాశాలు అందుకుంది త‌ప్ప‌! విజ‌యాలు ఎన్ని అంటే? చెప్ప‌లేని స‌న్నివేశ‌మే ఎదుర‌వుతుంది. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ అమ్మ‌డు జ‌ర్నీ ఇలాగే సాగింది.

అయితే ఇప్పుడు ట్ర‌యాంగిల్ స్టోరీని తెర‌పైకి తెచ్చింది. ఏ భాష‌ని వ‌ద‌ల‌కుండా మూడు భాష‌ల్లోనూ సినిమాలు చేయ‌డం ప్రారంభించింది. అవ‌కాశం చిన్న‌దా..పెద్ద‌దా? అన్న‌ది ప‌క్క‌న‌బెట్టి ముందు క‌మిట్ అయిపోతుంది. గ‌త ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాని రాశీఖ‌న్నా కొత్త ఏడాది లో మాత్రం బాగా జోరు పెంచిన‌ట్లే క‌నిపిస్తుంది. మిగ‌తా రెండు భాష‌ల‌కంటే హిందీలో ప్ర‌త్యేకంగా ఫోకస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే `యోధ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

కానీ ఫ‌లితం ఆశించిన విధంగా రాలేదు. గోద్రా రైలు ద‌హ‌న‌కాండ‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్` లోనూ న‌టించింది. ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. విక్రాంత్ మాస్సే ఇందులో హీరోగా న‌టించాడు. అలాగే `టీఎమ్ ఈ` అనే మ‌రో సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. వీటిని అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో బాగానే ప్రచారం చేస్తోంది.

ఏ తెలుగు సినిమాని....త‌మిళ సినిమాని ప్ర‌చారం చేయ‌నంత‌గా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి మ‌రీ త‌న వ్య‌క్తిగ‌త ఖాతాల ద్వారా ప్ర‌చారం చేస్తోంది. ఇంకా హిందీలో మ‌రో మూడు సినిమాల‌కు క‌మిట్ అయింద‌ని స‌మాచారం. వాటి అవివ‌రాలు త్వ‌ర‌లోనే రివీల్ చేయనుందిట‌. తెలుగు..త‌మిళ్ లో ఓ రెండు సినిమాలు చేస్తోంది. కానీ వాటిని ఎక్క‌డా ప్ర‌చారం చేయ‌లేదు. దీన్ని బ‌ట్టి రాశిఖ‌న్నా దృష్టంతా బాలీవుడ్ సినిమాల‌పైనే ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మ‌వుతోంది.