Begin typing your search above and press return to search.

నిత్యామీన‌న్‌ని వేధించిన హీరో.. ఇదీ సంగ‌తి!

అయితే నిత్యామీనన్ కోలీవుడ్‌లో న‌టించేప్పుడు, ఓ ప్ర‌ముఖ‌ త‌మిళ హీరో వేధించాడంటూ ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:59 AM GMT
నిత్యామీన‌న్‌ని వేధించిన హీరో.. ఇదీ సంగ‌తి!
X

జూనియ‌ర్ సౌంద‌ర్య‌గా తెలుగు వారి గుండెల్లో నిలిచిన‌ నిత్యామీన‌న్ ని ప్ర‌ముఖ హీరో వేధించాడు అంటూ ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ఇది నిజ‌మా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

బ‌హుభాష‌ల్లో త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో గొప్ప స్టార్ గా పాపుల‌రైన నిత్యామీన‌న్ ఇటీవ‌ల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తెలుగు, త‌మిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లో 50కి పైగా చిత్రాలలో నటించిన నిత్యా సౌత్ లో బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. కెరీర్ లో నిత్యా విభిన్నమైన పాత్రల్లో నటించి సత్తా చాటుకుంది.

అయితే నిత్యామీనన్ కోలీవుడ్‌లో న‌టించేప్పుడు, ఓ ప్ర‌ముఖ‌ త‌మిళ హీరో వేధించాడంటూ ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది. ఇది నిజ‌మా? అని ప్ర‌శ్నిస్తే.. ఇవ‌న్నీ పూర్తిగా నిరాధారమని నిత్యామీన‌న్ స్పష్టం చేసింది. ఈ గాసిప్ ని ప్ర‌ముఖ కోలీవుడ్ జ‌ర్న‌లిస్ట్ తన X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసారు. అతడు నిత్యాతో తన సంభాషణ తాలూకా స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేయ‌డంతో ఇది నిజ‌మేన‌ని అంతా భావించారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని, ఆ వార్త తప్పుడు వార్త‌ అని నిత్యా ఖండించింది. నిత్యా మీనన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా పుకారుపై విమర్శలు గుప్పించింది.

తన సోషల్ మీడియాలో ఇలా రాసింది: ''ఇది తప్పుడు వార్త! పూర్తిగా అవాస్తవం! నేను ఎప్పుడూ అత‌డికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎవరికైనా తెలిస్తే - దయచేసి ఈ పుకారును ఎవరు ప్రారంభించారో నాకు చెప్పండి. కేవలం క్లిక్‌లను పొందడానికి ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్ చేసేవారిని బాధ్యులను చేయాలి'' అని వ్యాఖ్యానించింది.

టాలీవుడ్‌లో తనకు ఎప్పుడూ సమస్య ఎదురుకాలేదని నిత్యామీనన్ చెప్పినట్లు సోషల్ మీడియాలలో ప్ర‌చార‌మైంది. అయితే కోలీవుడ్‌లో గతంలో ఒక పెద్ద హీరో వేధించిన సందర్భం కూడా ఉంది.. అని వ్యాఖ్యానించిన‌ట్టు స‌ద‌రు వ్య‌క్తి స్క్రీన్ షాట్ లో రాసారు. అయితే నిత్యా ఇలా మాట్లాడిన‌ట్టు ఎలాంటి రుజువు లేదు.

నిత్యా మీనన్ చివరిగా 2023లో మలయాళంలో టి.కె రాజీవ్ కుమార్ తెర‌కెక్కించిన 'కొలాంబి'లో కనిపించింది. ఇందులో రెంజీ పనికర్, దిలీష్ పోతన్, సిజోయ్ వర్గీస్, రోహిణి త‌దిత‌రులు నటించారు.

తదుపరి 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్‌లో కనిపిస్తుంది. దీనిని గోమతేష్ ఉపాధ్యాయ్ తెర‌కెక్కించారు. సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇందులో 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ తమిళం, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్ కథ ఒక వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది.

అలాగే ధనుష్ దర్శకత్వం వహించిన త‌మిళ గ్యాంగ్‌స్టర్ చిత్రంలో కూడా నిత్యా మీనన్ కనిపించనుంది. ధ‌నుష్ ఇందులో ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా D50 అని పేరు పెట్టారు. SJ సూర్య, కాళిదాస్ జయరామ్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.