Begin typing your search above and press return to search.

కృతి సనన్ కి ఆ విషయంలో మొహమాటం లేదట

తాజాగా ఆలియా భట్ తో కలిసి జాతీయ అవార్డు ను దక్కించుకున్న కృతి సనన్ ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

By:  Tupaki Desk   |   5 Sep 2023 2:45 AM GMT
కృతి సనన్ కి ఆ విషయంలో మొహమాటం లేదట
X

టాలీవుడ్‌ లో మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా తో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతి సనన్. తెలుగు లో ఈ అమ్మడికి మొదటి సినిమా తో నిరాశ మిగిలింది. ట్రై చేస్తే మరికొన్ని సినిమాలు తెలుగు లో దక్కేవేమో. కానీ ఆమె తెలివిగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మెల్ల మెల్లగా కెరీర్‌ సాగింది. ఈ మధ్య కాలంలో ఈమె జోరు పెంచింది.

తాజాగా ఆలియా భట్ తో కలిసి జాతీయ అవార్డు ను దక్కించుకున్న కృతి సనన్ ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు తినే విషయం లో అసలు మొహమాటం లేదు. తనకు సన్నిహితులు అయిన వారు తింటూ ఉంటే వారి వద్ద తినడం కూడా నాకు అలవాటే. అలా నాకు కోవిడ్‌ వచ్చిందని కూడా ఇంటర్వ్యూలో పేర్కొంది.

స్నేహితులు, సన్నిహితులతో ఒకే ప్లేట్‌ లో తినడం అనేది అలవాటుగా ఉండేది. వారితో ఫుడ్ ను పంచుకునే విషయంలో నేను మొహమాట పడేదాన్ని కాదు. అందుకే నాకు ఆ సమయంలో కరోనా వచ్చిందని, కరోనా వచ్చినా కూడా నేను వెంటనే కోలుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. కృతి సనన్‌ ఫుడ్ విషయం లో గతంలో మొహమాటం లేకుండా ఉన్నా ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇక ఈమె ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న ముద్దుగుమ్మ కృతి సనన్ ముందు ముందు సౌత్ సినిమాల్లో, పాన్ ఇండియా సినిమాలో నటించే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.