Begin typing your search above and press return to search.

మన ప్రేమ చిరస్థాయిగా నిలుస్తుంది

అలాంటి ఖుష్బూను సుందర్‌ వివాహం చేసుకుని పాతిక సంవత్సరాలు కావస్తుంది. తాజాగా ఖుష్బూ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ ను షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:30 PM GMT
మన ప్రేమ చిరస్థాయిగా నిలుస్తుంది
X

1990 ల్లో టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఖుష్బూ. అప్పట్లోనే తమిళ మరియు తెలుగు ఇండస్ట్రీకి చెందిన దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కూడా స్క్రీన్‌ పంచుకుంది. ఇప్పుడు కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.

కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపై పలు సీరియల్స్ తో కూడా ఖుష్బూ సందడి చేస్తోంది. ఇక తెలుగు బుల్లి తెరపై రియాల్టీ షో లు ఇతర షో ల ద్వారా కూడా ఖుష్బూ వినోదాన్ని పంచుతూ ఉంది. అప్పట్లో ఖుష్బూ కోసం గుడి కట్టారు అంటే ఆమె అందం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఖుష్బూను సుందర్‌ వివాహం చేసుకుని పాతిక సంవత్సరాలు కావస్తుంది. తాజాగా ఖుష్బూ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ ను షేర్‌ చేసింది. సుందర్ 1995 ఫిబ్రవరి 22న ప్రేమను తనకు వ్యక్తం చేశాడు అంటూ గుర్తు చేసుకుంది. ఈ 29 ఏళ్ల ప్రేమ ప్రయాణంలో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఆమె తన పోస్ట్‌ లో పేర్కొంది.

ప్రేమలో అయిదు సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. 2000 సంవత్సరంలో ఖుష్బూ వివాహం జరిగిన విషయం తెల్సిందే. ప్రేమించిన రోజు చెప్పి 29 ఏళ్లు అయిన సందర్భంగా ఖుష్బూ సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది.

ఖుష్బూ... ఈ 29 ఏళ్లలో ఏ మార్పులు రాలేదు. మనమూ మారలేదు. మన ప్లస్ లు మైనస్ లు అన్నీ కూడా అంగీకరిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరికి ఒకరం మద్దతుగా నిలుస్తూ ఇన్నాళ్ల జీవన ప్రయాణం సాగించాం. ఇదే మన కుటుంబంను ఆనందంగా ఉండేలా చేసింది. ఆ రోజు మీ ప్రేమను అంగీకరించడం అనే నిర్ణయం సరైనదే అని ప్రతి రోజు నిరూపిస్తూనే ఉన్నారు.

మన ప్రేమ చిరస్థాయిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మీరు నాతో మీ ప్రేమను చెప్పిన రోజును ఎప్పటికీ మరచిపోలేను. ఆరోజులు ఇప్పటికి కూడా గుర్తు ఉంటాయని ఖుష్బూ చెప్పుకొచ్చింది. ఖుష్బూ, సుందర్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు నటన వైపు మరొకరు ఫిల్మ్‌ మేకింగ్ వైపు అడుగులు వేస్తున్నారు.