Begin typing your search above and press return to search.

రోజా ఎవరు?.. ప్రముఖ సినీ నటి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగన రనౌత్‌ గురించి తెలియనివారు ఉండరు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సర సన 'ఏక్‌ నిరంజన్‌' సినిమాలో నటించింది

By:  Tupaki Desk   |   6 Sep 2023 8:31 AM GMT
రోజా ఎవరు?.. ప్రముఖ సినీ నటి సంచలన వ్యాఖ్యలు!
X

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగన రనౌత్‌ గురించి తెలియనివారు ఉండరు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సర సన 'ఏక్‌ నిరంజన్‌' సినిమాలో నటించింది. బాలీవుడ్‌ లో.. ఫ్యాషన్, క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్‌ మను తదితర చిత్రాల విజయాలతో తన స్టామినాను నిరూపించుకుంది.

మరోవైపు కంగన రనౌత్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలుస్తూ ఉంటారు. గతంలో బాలీవుడ్‌ లో నెపోటిజంపైన కంగన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అలాగే బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ గా పేరొందిన హృతిక్‌ రోషన్‌ తో ఎఫైర్‌ విషయంలో కంగన బోల్డ్‌ కామెంట్స్‌ సంచలనం సృష్టించాయి.

ప్రస్తుతం కంగన రనౌత్‌.. పి.వాసు దర్శకత్వంలో వస్తున్న చంద్రముఖి-2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో లారెన్స్‌ కథానాయకుడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కంగన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ సినీ నటి, ఏపీ ప్రభుత్వం పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న రోజాపై కంగన హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె ఎవరో తనకు తెలియదన్నారు. సినిమాల్లో నటించేవారు రాజకీయాల్లోకి రాకూడదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి గతంలో రోజా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియాతో మాట్లాడిన కంగన రనౌత్‌ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని తెలిపారు. వాస్తవానికి గత పార్లమెంటు ఎన్నికల్లోనే కంగన పోటీకి ఆసక్తి చూపారు. అయితే బీజేపీ ఆమెను బరిలో దింపలేదు. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదని రోజా వ్యాఖ్యలను కంగనాకు మీడియా గుర్తు చేయగా ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు. రోజా ఎవరో తనకు తెలియదన్నారు. అలాంటివారు ఉన్నారన్న విషయమే తనకు తెలియదని స్పష్టం చేశారు. ఇక ఆమె గురించి తానేమి మాట్లాడతాన న్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే వదులుకోనని కంగనా స్పష్టం శారు. దీంతో కంగనా కామెంట్స్‌ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

కాగా దేశానికి పేరు మార్పు అంశంపై కూడా కంగన స్పందించారు. తాను రెండేళ్ల క్రితమే ఈ అంశం గురించి మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల్లోకి అవకాశం లభిస్తే తాను వదులుకోనని స్పష్టం చేశారు. తన వంతుగా తాను పేదలకు మేలు చే స్తున్నానని వెల్లడించారు. ఎంతో మంది పేదలకు సాయం చేశానన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ వ్యాఖ్యలపైన మంత్రి రోజా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.