Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో చేరిన స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ న‌టి భూమి ప‌డ్నేక‌ర్ ఆసుప‌త్రి పాలైంది. ఆసుప‌త్రి నుంచి బెడ్ మీద ప‌డుకుని ఎన్న ఓ ఫోటోని షేర్ చేసి అభిమానుల్ని కంగారు పెట్టింది

By:  Tupaki Desk   |   23 Nov 2023 6:23 AM GMT
ఆసుప‌త్రిలో చేరిన స్టార్ హీరోయిన్!
X

బాలీవుడ్ న‌టి భూమి ప‌డ్నేక‌ర్ ఆసుప‌త్రి పాలైంది. ఆసుప‌త్రి నుంచి బెడ్ మీద ప‌డుకుని ఎన్న ఓ ఫోటోని షేర్ చేసి అభిమానుల్ని కంగారు పెట్టింది. అభిమానులు మీరు జాగ్ర‌త్త అంటూ సూచ‌న‌లు జారీ చేసింది. మ‌రి భూమీ ప‌డ్నేక‌ర్ ఎందుకు ఆసుప‌త్రి పాలైంది? అభిమానుల‌కు ఎందుక‌న్ని జాగ్ర‌త్త‌లు చెబుతుందో తెలియాలంటే మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే. అమ్మ‌డు కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతుంది. డెంగ్యూ దొమ‌కాటుకు గురై తీవ్ర జ్వ‌రం రావ‌డంతో ఆసుప‌త్రిలో చేరింది.


ప్ర‌స్తుతం అక్క‌డే వైద్యం పొందుతుంది. ఈ సంద‌ర్భంగా సీజ‌న్ లో జాగ్ర‌త్త గా ఉండండ‌ని అభిమానుల‌కు మేసెజ్ పాస్ చేసింది. 'ఎనిమిది రోజులుగా నరకం అనుభవిస్తున్నా. కాలుష్య స్థాయిల కారణంగా డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అభిమానులు మీరు జాగ్రత్తగా ఉండండి. ప్ర‌జ‌లంతా దోమ‌ల నివారిణిని ఉప‌యోగించండి. ఎనిమిది రోజుల తర్వాత ఇప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నా.

శ‌రీరానికి రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంతో అవ‌స‌రం. దాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించండి. అధిక కాలుష్య స్థాయిలు మన రోగనిరోధక శక్తిని చాలా వరకు దెబ్బతీస్తాయి. నాకు తెలిసిన కొంత మందికి ఇటీవల డెంగ్యూ వచ్చింది. కేసుల సంఖ్య గ‌ణ‌ణీయంగా పెరుగుతుంది' అని రాసుకొచ్చింది. అలాగే ఆసుప‌త్రిలో వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ల‌కు..స్టాప్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

'ఏక్ డెంగ్యూ కే మచార్ నే.. ముఝే 8 దిన్ కా భారీ టార్చర్ దే దియా' అని పోస్టు క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. 'ఈరోజే కొంచెం కోలుకున్నాను. అందుకే సెల్ఫీ ఫొటోలను షేర్ చేశాన'ని తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ఫోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. భూమి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల సంగ‌తి చూస్తే చివ‌రిగా 'ది లేడీ కిల్లర్'.. 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'లో కనిపించింది. ప్రస్తుతం 'మేరీ పట్నీ కా' రీమేక్ లో న‌టిస్తోంది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో నాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.