Begin typing your search above and press return to search.

కన్నీళ్లు పెట్టుకుని అక్కడే ఉండిపోను!

కరోనా ముందు బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సందడి చేసింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 2:47 PM GMT
కన్నీళ్లు పెట్టుకుని అక్కడే ఉండిపోను!
X

కరోనా ముందు బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సందడి చేసింది. తెలుగు లో విజయ్ దేవరకొండకు జోడీగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా అనన్య పాండేకు తెలుగు లో డిజాస్టర్‌ తప్పలేదు.

స్టార్‌ కిడ్‌ అవ్వడంతో పాటు ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్న కారణంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. తాజాగా డ్రీమ్‌ గర్ల్ 2 సినిమాలో నటించిన అనన్య పాండే ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియా తో ముచ్చటించిన సందర్భంగా సోషల్‌ మీడియా ట్రోల్స్ గురించి.... తనపై వచ్చే అసభ్యకర మీమ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అనన్య పాండే మాట్లాడుతూ... ఎవరైనా నేను చేసిన పనిని మరో విధంగా చేస్తే బాగుండేది అని చెబితే నేను స్వీకరిస్తాను. నువ్వు ఇది చేయగలవు, ఎందుకు చేయడం లేదు అంటూ కామెంట్‌ చేస్తే స్వీకరించగలను. కానీ పదే పదే కొందరు కావాలని ట్రోల్స్ చేయడం ను తట్టుకోలేక పోతున్నట్లుగా ముద్దుగుమ్మ అనన్య పాండే చెప్పుకొచ్చింది.

తన వ్యక్తిగతం పై కొందరు పదే పదే ట్రోల్స్ చేయడంతో నాకు చాలా సార్లు బాధ అనిపించింది. కన్నీళ్లు పెట్టుకున్నాను. విమర్శలతో బాధ పడ్డాను, కన్నీళ్లు పెట్టుకున్నాను కానీ అక్కడే ఆగిపోలేదు. నేను ముందుకు సాగుతూనే ఉన్నాను. నా కెరీర్‌ లో విజయం కోసం వాటన్నింటిని ఎక్కడివి అక్కడే వదిలేస్తున్నాను. నాకు సహకరించే వారితో నా కెరీర్‌ ను బిల్డ్‌ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.