Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

2001లో రేపల్లెలో రాధ సినిమాతో పరిచయమైన అమ్మడు ఆ సినిమాతో పర్వాలేదు అనిపించినా 2003లో వచ్చిన మా బాపు బొమ్మకు పెళ్లంట సినిమాతో హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 3:30 PM GMT
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?
X

చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కొందరు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి స్టార్ క్రేజ్ సంపాదిస్తే.. మరికొందరు తమ అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంటారు. అయితే ఒకటి రెండు సినిమాలు తీసి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అవకాశాలు లేదా పరిశ్రమలో ఉండలేకనో కానీ కొందరు హీరోయిన్స్ కెరీర్ అర్ధాంతరంగా ముగుస్తుంది. అలా 2000 దశాబ్ధంలో రెండు మూడు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాలను ఆపేసిన హీరోయిన్ గాయత్రి రఘురాం.

2001లో రేపల్లెలో రాధ సినిమాతో పరిచయమైన అమ్మడు ఆ సినిమాతో పర్వాలేదు అనిపించినా 2003లో వచ్చిన మా బాపు బొమ్మకు పెళ్లంట సినిమాతో హిట్ అందుకుంది. అందులో మాటలే రాని వేల సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లే లిస్ట్ లో ఉంటుంది. ఆ సినిమా హిట్టైనా కూడా గాయత్రికి పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె సినిమాలు చేసింది. అక్కడ కూడా అంత గొప్పగా కెర్రీర్ సాగలేదు.

హీరోయిన్ గానే కాదు డ్యాన్స్ కంపోసర్ గా కూడా గాయత్రి వర్క్ చేసింది. అయితే కెరీర్ అంత ఆశాజనకంగా లేదని 2006 లో కాలిఫోర్నియాకి చెందిన దీపక్ చంద్రశేఖర్ ని పెళ్లాడింది. 2010 లో భర్త నుంచి విడాకులు తీసుకుంది గాయత్రి.2014 లో బీజేపీలో చేరిన ఆమె ఈమధ్యనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది. సోషల్ మీడియా వల్ల ఎక్కడెక్కడి వారో ప్రత్యక్షం అవుతుంటారు. అలానే గాయత్రి రఘురాం కూడా చాలా రోజుల తర్వాత దర్శనమించ్చింది.

మా బాపు బొమ్మకు పెళ్లంటలో ఉన్న గాయత్రి ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించింది.