Begin typing your search above and press return to search.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కి క‌ట్ట‌ప్ప మ‌ద్ద‌తు!

ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టుడు స‌త్య‌రాజ్ అలియాస్ క‌ట్ట‌ప్ప ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 7:09 AM GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కి క‌ట్ట‌ప్ప మ‌ద్ద‌తు!
X

స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని.. అది మ‌లేరియా.. డెంగ్యూ.. క‌రోనా లాంటింద‌ని న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు, మ‌హిళా సాధికార‌త‌కు వ్యతిరేకమని ఉద‌య‌నిధి పెద్ద దుమార‌మే రేపారు.

ఈ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాయో తెలిసిందే. నెటి జ‌నులంతా న‌టుడిపై విరుచు కు ప‌డ్డారు. రాజ‌కీయంగానూ దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీ మ‌ద్దతు ఇవ్వగా, బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్రంగా ఖండించారు. అయితే సినీ న‌టులెవ్వ‌రూ ఈ కాంట్ర‌వ‌ర్శీపై ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టుడు స‌త్య‌రాజ్ అలియాస్ క‌ట్ట‌ప్ప ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఉదయనిధి వ్యాఖ్యల్లో స్పష్టత ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. 'ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించే తీరును చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది' అని అన్నారు. త‌మిళ‌నాడు సీఏం స్టాలిన్ ని స‌త్య‌రాజ్ స‌చివాల‌యాలంలో క‌లిసిన అనంత‌రం ఈ వ్యాఖ్య‌లు చేసారు.

దీంతో స‌త్య‌రాజ్ పైనా సోష‌ల్ మీడియాలో భిన్న ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై ఎలా మ‌ద్ద‌తిస్తార‌ని ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్న వారు కొంత మంది అయితే..ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న వారు మ‌రికొంత మంది. స‌త్య‌రాజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితుడే. 'మిర్చి'..'బాహుబ‌లి' లాంటి సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

టాలీవుడ్ లో బాగా అవ‌కాశాలు అందుకుంటోన్న న‌టుడాయ‌న‌. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'వాల్తేరు వీర‌య్య‌'లోనూ న‌టించారు. ప్ర‌స్తుతం 'జీబ్రా' అనే సినిమాతో పాటు రెండు..మూడు మ‌ల‌యాళ సినిమాల్లో న‌టిస్తున్నారు.