Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

కోలివుడ్ నటుడు, ప్రముఖ డైరెక్టర్ జి మారి ముత్తు(57) సడెన్ గా చనిపోయారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 7:16 AM GMT
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజాగా చిత్రం జైలర్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. రజినీకాంత్ స్టార్ డమ్ ని మరోసారి అభిమానులకు పరిచయం చేసిన సినిమా ఇది కావడం విశేషం. కేవలం రజినీ మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించిన అందరికీ విపరీతమైన గుర్తింపు వచ్చింది. అయితే, ఈ మూవీలో నటించిన ఓ నటుడు సడెన్ గా ప్రాణాలు కోల్పోయాడు.

కోలివుడ్ నటుడు, ప్రముఖ డైరెక్టర్ జి మారి ముత్తు(57) సడెన్ గా చనిపోయారు. గుండెపోటుతో ముత్తు చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. దర్శకుడిగా, నటుడిగా కోలివుడ్ లో ముత్తు తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించాడు. కాగా, ఆయన రజినీ కాంత్ జైలర్ మూవీలో కీలక పాత్ర పోషించారు.

విలన్ గ్యాంగ్ లో వ్యక్తిగా ఆయన నటించారు. కాగా, ఆయన మృతి పట్ల అందరూ షాకయ్యారు. సినీ ప్రముఖులంతా ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడెన్ గా ఇలా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇదిలా ఉండగా, మారి ముత్తుకు సినిమాల్లో రావడానికి చాలా కష్టపడ్డారు. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేదట. అయితే, ఇంట్లో వారు అంగీకరించలేదట. దీంతో, ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి మరీ, ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. మొదట చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టారు.

ఆ తర్వాత ఆయన డైరెక్టర్ గా కూడా మారి పలు సినిమాలు కూడా చేశాడు. మణిరత్నం, వసంత్, ఎస్ జే సూర్య వంటి దర్శకుల దగ్గర కూడా పని చేశారు. కన్నుమ్ కన్నుమ్ వంటి సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. అయితే, ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.