Begin typing your search above and press return to search.

వరల్డ్ ఫేమస్ లవర్.. లాభాలు వచ్చి ఉంటే ఇచ్చేవారా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన ఖుషి మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:34 AM GMT
వరల్డ్ ఫేమస్ లవర్.. లాభాలు వచ్చి ఉంటే ఇచ్చేవారా?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన ఖుషి మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉందనే మాట మూవీ చూసే ఆడియన్స్ నుంచి వస్తోంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండకి ఖుషితో హ్యాపీనెస్ వచ్చిందని చెప్పాలి. ఈ సక్సెస్ ని విజయ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

అందులో భాగంగా ఖుషి సినిమా కోసం తాను అందుకున్న రెమ్యునరేషన్ నుంచి కోటి రూపాయిలు ప్రజలకి సాయం చేస్తానని ప్రకటించాడు. వంద పేద కుటుంబాలని ఎంపిక చేసుకొని లక్ష రూపాయిల చొప్పున అందిస్తానని చెప్పాడు. ఇది నిజంగా గొప్ప నిర్ణయం అని చెప్పాలి. చాలా మంది హీరోలకంటే విజయ్ దేవరకొండ ఈ విషయంలో బెస్ట్ అని ఒప్పుకోవాల్సిందే.

అయితే విజయ్ దేవరకొండ ప్రకటనపై అభిషేక్ పిక్చర్స్ డిస్టిబ్యూటర్ కామెంట్ చేశారు. విజయ్ మీరు తీసిన మోస్ట్ ఫేమస్ లవర్ మూవీని మేము డిస్టిబ్యూట్ హక్కులు కొనుగోలు చేసి ఎనిమిది కోట్లు నష్టపోయాం. దీనిపై ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. మీరు ప్రజల కోసం కోటి సాయం చేస్తున్నారు. అలాగే మమ్మల్ని కూడా కాస్తా ఆదుకోండి అంటూ సెటైరికల్ గా పోస్ట్ చేశారు.

డిస్టిబ్యూటర్స్ కి సినిమాలతో లాభాలు వచ్చినపుడు వాటిని తీసుకొచ్చి హీరోకి ఇవ్వడం లేదు. హ్యాపీగా అనుభవిస్తున్నారు. మరి నష్టాలు వచ్చినపుడు హీరోని ఎలా అడుగుతారు అంటూ నెటిజన్లు అభిషేక్ పిక్చర్స్ వారికి కౌంటర్లు వేస్తున్నారు. ప్రజలకి సాయం చేస్తానని ముందుకొచ్చిన హీరోపై ఇలా వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం కరెక్ట్ అనిపిస్తుందా అని రౌడీ స్టార్స్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు.

ఇలాంటి అతి కామెంట్స్ వలన ఇబ్బందిపడేది మీరే అంటూ అభిషేక్ పిక్చర్స్ డిస్టిబ్యూటర్ కి రౌడీ ఫ్యాన్స్ మాటలతో టార్చర్ చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ తక్కువ సమయంలో స్టార గా ఎదిగాడు. అతని ఎదుగుదలని హర్షించని వారు చాలా మంది ఉంటారు. డిస్టిబ్యూటర్స్ కి ఇతర స్టార్ హీరోల కారణంగా నష్టపోయినపుడు కూడా డబ్బులు డిమాండ్ చేసే దమ్ముందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.