పారితోషికం తీసుకోకుండా నష్టం..లాభం చూసిన హీరో!
180 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా 100 కోట్లు కూడా వసూళ్లు తేలేకపోయింది.
By: Tupaki Desk | 8 May 2025 3:30 PMబాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది పారితోషికం తీసుకోరు. సినిమాలో తన పారితోషికాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాల్లో వాటా తీసుకుంటారు. అలాగని సినిమా పూర్తిగా నష్టాలొస్తే భరించే హీరోలు కూడా అందరూ కాదు. కేవలం కొందరు మాత్రమే ఆ ధైర్యానికి పూనుకుంటారు. అందులో అమీర్ ఖాన్ ముందులో ఉన్నారు? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసారు.
అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ సినిమా తొలి షోతోనే డిజాస్టర్ గా తెలిపోయింది. 180 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా 100 కోట్లు కూడా వసూళ్లు తేలేకపోయింది. ఈ చిత్రాన్ని వయోకామ్ 18 స్టూడియోస్ -అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ పెట్టుపడి అయినా? నష్టలొచ్చాయని తెలిసి రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదుట.
ఈ సినిమాతో ఈవిషయం చాలా మందికి తెలిసిందన్నారు. కానీ చాలా కాలంగా ఆయన ఇదే విధానంలో సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. తను ఏ సినిమా చేసినా హిట్ అయితే తన జేబులో రూపాయి పడు తుందని..లేదంటే చిల్లి గవ్వకూడా ఉండదన్నారు. డబ్బులు కావాలంటే తన సొంత ఖాతా నుంచి తీసుకోవాల్సిందే తప్ప...నిర్మాతను మాత్రం రూపాయి కూడా అడగనన్నారు.
ఈ విషయంలో తానెప్పుడు బాధపడలేదన్నారు. ఇలా చేయడమే తనకు న్యాయంగా అనిపిస్తుందన్నారు. నటుడిగా దీన్ని ఓ బాధ్యతగా భావించారు. సినిమా పోయింది కదా? ఇన్ని రోజులు షూటింగ్ లో పాల్గొ న్నాను... నా డబ్బు నాకివ్వండని చేయి చాచను. సినిమా ప్లాప్ అయితే అందులోనే తాను భాగంగానే చెప్పుకొచ్చారు. అందుకే అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్పెపెక్ట్ నిస్ట్ అయ్యారు.