Begin typing your search above and press return to search.

కూల్‌ డ్రింక్‌ లో మద్యం కలిపి.. యూసుఫ్‌ గూడలో దారుణం!

ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మహిళకు ఆన్‌ లైన్‌ గేమింగ్‌ లో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 1:30 PM GMT
కూల్‌ డ్రింక్‌ లో మద్యం కలిపి.. యూసుఫ్‌ గూడలో దారుణం!
X

ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలూ తీసుకోవడం.. అనంతరం, వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడటం వంటి సంఘటనలు నిత్యం వెలుగు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

అవును... యూసఫ్ గూడలో వివాహిత విషయంలో ఘోరం జరిగింది. కూల్‌ డ్రింక్‌ లో మద్యం కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాదు ఓ ప్రబుద్ధుడు. అనంతరం నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బాధితురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరగగా... బాధితురాలు ఏపీలో సూసైడ్ అటెంప్ట్ చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మహిళకు ఆన్‌ లైన్‌ గేమింగ్‌ లో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఆమె 2020 జూన్‌ 10న పెళ్లి చేసుకుంది. ఇది నచ్చని రెండో వ్యక్తి ఈమె వెంట పడటం ప్రారంభించాడు.

ఇందులో భాగంగా.. ప్రేమిస్తున్నానంటూ ఫోన్‌ లో మెసేజ్ లు పంపుతుండటం, తరచూ ఫోన్‌ చేస్తుండటం చేసేవాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఆ మహిళ ఉద్యోగం చేస్తానని నగరానికి వచ్చి బల్కంపేటలో తన స్నేహితురాలి ఫ్లాట్‌ కు వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న రెండో వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమీర్‌ పేట్‌ లోని ఓ హాస్టల్ లో చేర్పించాడు. ఇదే క్రమంలో రెహమత్ నగర్‌ పరిధిలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు.

ఈ సమయంలో ఆ మహిళను అక్కడికి పిలిపించిన ఆ వ్యక్తి... కూల్‌ డ్రింక్‌ లో మద్యం కలిపి ఆమెతో తాగించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే క్రమంలో... వీడియోలు, ఫొటోలు కూడా తీశాడు. అనంతరం బెదిరింపులు ప్రారంభించాడు.

దీంతో వేదింపులు, బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో స్వగ్రామానికి వెళ్లిన ఆ మహిళ అక్కడ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడంతో.. పోలీసులు ఏపీలో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసి మధురానగర్‌ స్టేషన్ కు బదిలీ చేశారు.