Begin typing your search above and press return to search.

సింగపూర్ లో మహిళకు ఉరిశిక్ష... షాకింగ్ రీజన్!

45 ఏళ్ల మహిళ ను వచ్చే శుక్రవారం (జులై 28)న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

By:  Tupaki Desk   |   25 July 2023 12:40 PM GMT
సింగపూర్ లో మహిళకు ఉరిశిక్ష... షాకింగ్ రీజన్!
X

ఈ మధ్యకాలం లో ఉరిశిక్ష కు సంబంధించిన సంఘటనలు కనిపించడం అరుదు అని అంటుంటారు. అయితే తాజాగా సింగపూర్ లో ఈ సంఘటన జరగబోతోంది. ఇందులో భాగంగా ఇద్దరు దోషుల ను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీయబోతోంది. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం!

అవును... మరణ శిక్ష పడిన ఇద్దరు దోషుల ను సింగపూర్‌ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి వారు ఈ శిక్షను అనుభవించనున్నారు. అయితే... సింగపూర్‌ లో ఓ మహిళ కు ఉరిశిక్ష అమలు చేయడం గత 20 ఏళ్లలో ఇది తొలిసారి కావడం గమనార్హం!

వివరాళ్లోకి వెళ్తే... సింగపూర్ లో హత్యలు, కిడ్నాప్‌ ల వంటి తీవ్రమైన నేరాలతోపాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు కూడా అత్యంత కఠిన చట్టాల ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషుల కు మరణశిక్ష తప్పదు.

ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి 50 గ్రాముల హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఈ కేసు లో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని ఈ బుధవారం (జులై 26) చాంగీ జైలు లో ఉరి తీయనున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ ఫర్మేటివ్‌ జస్టిస్‌ కలెక్టివ్‌ (టీజేసీ) వెల్లడించింది.

ఇదే సమయంలో 30 గ్రాముల హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో 45 ఏళ్ల మహిళ ను వచ్చే శుక్రవారం (జులై 28)న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఈమెకు 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. కానీ.. ఇప్పుడు అమలు చేస్తున్నారు.

కారణం... కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలు ను సింగపూర్‌ ప్రభుత్వం నిలివేసింది. అయితే ఈ మధ్య మళ్లీ శిక్షల అమలు చేపట్టింది. దీంతో... ఉరిశిక్ష అమలు తేదీల పై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని తెలుస్తుంది.

ఈ నెల 28న ఆ మహిళ కు ఉరిశిక్ష అమలైతే సుమారు గడిచిన 20 ఏళ్లలో సింగపూర్‌ లో ఓ మహిళ ను ఉరితీయడం ఇదే తొలిసారి కానుందని తెలుస్తుంది. గతం లో డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసు లో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళకు 2004లో ఉరిశిక్ష అమలు చేశారని అంటున్నారు.