Begin typing your search above and press return to search.

వీళ్లది ప్రేమ కాదు.. పైశాచికం.. తమ కోసం కట్టుకున్నోళ్లను చంపేశారు!

వెంకన్న.. నస్రీన్ లకు ముందే పెళ్లైంది. అయితే.. వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం తర్వాతి రోజుల్లో వివాహేతర సంబంధంగా మారింది

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:20 AM GMT
వీళ్లది ప్రేమ కాదు.. పైశాచికం.. తమ కోసం కట్టుకున్నోళ్లను చంపేశారు!
X

‘ప్రేమ’ ఎప్పుడూ చంపమని చెప్పదు. కానీ.. తీవ్రమైన వాంఛ.. అంతకు మించిన పైశాచికం కలగలిసిన వేళ.. స్వార్థంతో కట్టుకున్నవాళ్లను సైతం హతమార్చేందుకు వెనుకాడకుండా చేస్తుంది.దీనికి ప్రేమ లాంటి పదాన్ని వాడే కన్నా.. పైశాచికం అన్న మాటను వాడితే బాగుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాహేతర సంబంధం చివరకు వారి జీవిత భాగస్వామ్యుల్ని చంపేసే వరకు వెళ్లింది. ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

సూర్యపేటలో రెండు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. ఒక ఉదంతంలో భార్య చనిపోతే.. మరో ఉదంతంలో భర్త చనిపోయాడు. ఈ రెండు మరణాలు అనుమానాస్పదంగా ఉండటం.. ఈ రెండింటి మరణాల వెనుక అసలు లెక్క తేల్చే విషయంలో పోలీసులు అత్యంత నేర్పుగా వ్యవహరించటం ద్వారా.. దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి.

వెంకన్న.. నస్రీన్ లకు ముందే పెళ్లైంది. అయితే.. వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం తర్వాతి రోజుల్లో వివాహేతర సంబంధంగా మారింది. తాము కలిసి ఉండాలంటే.. తమ జీవిత భాగస్వామ్యులను ఎవరికి అనుమానం రాకుండా హతమార్చేందుకు భారీగా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో జులైలో తన భార్యను బయటకు తీసుకెళ్లిన వెంకన్న.. తన టూవీలర్ మీద వేగంగా వెళుతూ.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. బైక్ మీద నుంచి కిందపడిన భార్య తల బలంగా నేలకు తగలటం ఒక ఎత్తు అయితే.. అలా జరిగిన తర్వాత స్తంభానికేసి కొట్టేసి చంపేశాడు.

ఈ క్రమంలో తన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తనకు తాను గాయాలు పాలయ్యేలా చేసుకున్నాడు. ఆసుపత్రిలో చేరాడు. రోడ్డు ప్రమాదంలో తన భార్య మరణించిందని అందరిని నమ్మించాడు. ఈ ఉదంతాన్ని ఇలా వదిలేస్తే.. అక్టోబరు 9న వెంకన్నతో కలిసి ప్రియురాలు నస్రీన్ తన భర్తను హతమార్చింది. భర్తను గొంతు నులుమి చంపేసిన వీరు.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే.. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో సందేహాలు ఏర్పడటంతో.. మరింత లోతుగా విచారించే ప్రయత్నం చేయగా.. పోలీసులకు సైతం షాక్ తగిలే విషయాలు బయటకు వచ్చాయి. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని కాపాడుకునేందుకు.. తాము చేసిన దుర్మార్గాన్ని పోలీసులకు వెల్లడించటంతో వీరి పైశాచికత్వం ఏ రేంజ్ లో ఉందన్న విషయం వెలుగు చూసింది.