Begin typing your search above and press return to search.

ఇన్ స్టా లో బ్లాక్ చేసిందని భార్యను చంపేశాడు!

ఆమెకు ఇన్ స్టా గ్రాం లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారని భర్తకు అనుమానం, ఆవేశం, ఆగ్రహం వచ్చాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2023 11:30 PM GMT
ఇన్ స్టా లో బ్లాక్  చేసిందని భార్యను చంపేశాడు!
X

అనుమానానికి మిచిన భూతం లేదంటారు.. పైగా ఈ మధ్యకాలంలో, సోషల్ మీడియా లోకంలో, ఇంటర్నెట్ సమాజంలో దంపతుల మధ్య అనుమానాలు అనేవి రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ పరిచయాల ప్రభావం నిత్యం కనిపిస్తుండటంతో.. ఆ అనుమానం తాలుకు ప్రభావాలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ సమయంలో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

అవును... తన భార్య ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉంటుందని, ఆమెకు ఇన్ స్టా గ్రాం లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారని భర్తకు అనుమానం, ఆవేశం, ఆగ్రహం వచ్చాయి. ఫలితంగా ఆమెను కిరాతకంగా చంపాడు. పైగా... ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటంతో తనను బ్లాక్ చేసిందని చెబుతున్నాడంట!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్‌ లోని లఖ్‌ నవూ లో ఓ వ్యాపారవేత్త (37)కు ఒక భార్య, 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ సమయంలో వారంతా హ్యాపీగా జీవిస్తున్నారు. ఈ సమయంలో హౌస్ వైఫ్ గా ఉన్న తన భార్యకు ఇన్‌ స్టా లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటం.. అందులో తనను బ్లాక్‌ చేయడంతో భర్తకు కోపం వచ్చింది.

ఈ విషయంపై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందనే అనుమానం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం పిల్లలతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా మరోసారి వారి మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో పిల్లల ముందే కోపంతో భార్యను గొంతు కోసి హత్య చేశాడు.

ఆ తర్వాత అదే వాహనంలో లాక్‌ చేసుకుని ఉండిపోయాడు. అయితే.. అనుమానాస్పదంగా వాహనాన్ని పార్కింగ్‌ చేయడంతో పెట్రోలింగ్‌ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పిల్లలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.