Begin typing your search above and press return to search.

ఇదేం రాక్షస ప్రేమ? పెళ్లైన ప్రియుడ్ని కిడ్నాప్.. బలంతంగా మళ్లీ పెళ్లి!

By:  Tupaki Desk   |   13 Aug 2023 2:30 PM GMT
ఇదేం రాక్షస ప్రేమ? పెళ్లైన ప్రియుడ్ని కిడ్నాప్.. బలంతంగా మళ్లీ పెళ్లి!
X

ప్రేమలో రాక్షస ప్రేమ అన్నమాట వింటుంటాం. కానీ.. వాస్తవంలో అదెలా ఉంటుందో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. తాము కోరుకున్నది తమకు సొంతం కావాలన్న మొండిపట్టు.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఈ రాక్షస ప్రేమకు నిలువెత్తు రూపంగా ఉన్న ఈ ఉదంతం తమిళనాడులో సంచలనంగా మారింది. పెళ్లైన మాజీ ప్రియుడ్ని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి కట్టించుకున్న ఈ వ్యవహారం షాకింగ్ గా మారింది.

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై లోని వెళచ్చేరికి చెందిన ఐటీ ఉద్యోగి పార్తిబన్. అతనికి రాణిపేటకు చెందిన సౌందర్యతో కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. ఏడేళ్లు పాటు బాగానే ఉన్నా.. వారి ప్రేమలో చోటు చేసుకున్న విభేదాలతో వారిద్దరూ విడిపోయారు. ఇరువురు దూరంగా ఉంటూ ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.

గత నెల ఐదున పార్తిబన్ కు ఐటీ జాబ్ చేసే మరో అమ్మాయితో పెళ్లైంది. ఈ పెళ్లి గురించి తెలుసుకున్న ఆమె రగిలిపోయింది. ఏమైనా.. పార్తీబన్ తన సొంతం కావాలని డిసైడ్ అయ్యింది. తాను అతన్ని మర్చిపోలేదని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుదలతో ఉన్న ఆమె.. తన తల్లి.. బంధువులకు స్పష్టం చేసింది. ఇలాంటప్పుడు పెళ్లైన వ్యక్తితో ఇంకా ప్రేమేంటి? అంటూ రెండు పీకి క్లాస్ ఇవ్వాల్సింది పోయి.. ఆమె చెప్పింది చేస్తూ పెద్ద తప్పు చేవారు.

తన తల్లి.. బంధువులు రమేశ్.. శివకుమార్ ల సాయంతో ఆఫీసుకు వెళుతున్న పార్తీబన్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం కారులో అతన్ని తీసుకొని కాంచీపురంలోకి టెంపుల్ కు తీసుకెళ్లి.. వద్దన్నా వినకుండా సౌందరర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. ఇదిలా ఉండగా తన భర్త ఆఫీసుకు బయలుదేరి.. వెళ్లని వైనంపై పార్తీబన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో మాజీ ప్రియురాలు సౌందర్యను.. ఆమె బంధువులను అదుపులోకి తీసుకున్నారు. రాక్షస ప్రేమతో లేని తిప్పలు తప్పించి.. ప్రేమించినోడు దక్కడన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకుందో లేదో?