Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో దారుణం.. తమ్ముడి ముందే బాలికపై...!

16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:07 AM GMT
హైదరాబాద్‌  లో దారుణం.. తమ్ముడి ముందే బాలికపై...!
X

నిర్భయ, పోక్సో లాంటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా.. మహిళలు, బాలికలపై ఆత్యాచారయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి భయం లేకుండా దారుణ ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు కామాందులు. దీంతో ఆడపిల్లల రక్షణ విషయంలో తల్లితండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందని తెలుస్తోంది!

తాజాగా హైదరాబాద్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కత్తులతో భయపెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాళ్లోకి వెళ్తే... రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది! మైనర్‌ బాలికను కత్తులతో బెదిరించిన గంజాయి బ్యాచ్.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది! సొంత తమ్ముడి ముందే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు! ఎవరికైనా చెబితే చంపుతాం అంటూ బెదిరింపులకు దిగారు!

హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు గతంలో చనిపోవడంతో 15 రోజుల నుంచి ఆమె సోదరుడితో కలిసి మీర్ పేట్ లోని ఓ కాలనీకి వచ్చి సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. అయితే, బాలిక దిల్‌సుఖ్‌ నగర్‌ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో... బాలిక తన సోదరుడు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో.. ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు! అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తి పెట్టారు! అనంతరం భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లగా.. మిగిలిన వారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారిని బెదిరించారు! నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు!

ఈ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారైనట్లు బాలిక బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి మీర్‌ పేట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.