Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి రోజున చంపేశాడు.. కాకినాడలో దారుణం

కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు.. రెండో పెళ్లి రోజున ప్రేమించి పెళ్లాడిన భార్యను అత్యంత క్రూరంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 March 2024 4:51 AM GMT
రెండో పెళ్లి రోజున చంపేశాడు.. కాకినాడలో దారుణం
X

కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు.. రెండో పెళ్లి రోజున ప్రేమించి పెళ్లాడిన భార్యను అత్యంత క్రూరంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. అడ్డుగా వెళ్లిన మహిళను సైతం.. తప్పుకోకుంటే చంపేస్తానంటూ అతగాడి ఉన్మాదం షాకిచ్చేలా మారింది. అసలేం జరిగిందంటే..

కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన నూకరాజుకు.. దివ్యకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వారి పెళ్లి రోజు లీపు ఏడాది. అంటే.. 2016 ఫిబ్రవరి 29న పెళ్లైంది. దీంతో.. వీరి వివాహ వార్షికోత్సవం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంటుంది. వీరి దాంపత్యానికి నిదర్శనంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టు పనులు చేసే నూకరాజుకు అనుమానం రోగం ఉంది.

వ్యాపార పనుల నిమిత్తం బయట ఊళ్లకువెళ్లి వస్తుంటాడు. రెండు.. మూడు రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళ.. భార్య మీద అనుమానం పెంచుకొని ఆమెను ఇబ్బందికి గురి చేస్తుంటానడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బంధువులు.. కుటుంబ సభ్యులు వచ్చి వారి మధ్య పంచాయితీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు.

గురువారం ఉదయం బయటకు వెళ్లిన నూకరాజు.. కాసుపటికి తిరిగి వచ్చి మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. ఇంట్లో నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించినా..మొగుడు పెళ్లాల మధ్య పంచాయితీనే కదా అని ఊరుకున్నారు. గొడవ పెద్దది కావటం.. ఇంట్లో నుంచి దివ్య బయటకు రావటం.. అప్పటికే తన వద్ద ఉంచుకున్నకత్తితో దాడి చేశాడు. మెడ మీద తీవ్ర గాయమైన నేపథ్యంలో దివ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

కత్తితో పొడుస్తున్న వేళ.. దివ్య తోడికోడలు తల్లి లక్ష్మీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆమెపైనా దాడికి దిగాడు. తనకు అడ్డు వస్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆమె పక్కకు వెళ్లిపోయింది. భార్యను హత్య చేసిన నూకరాజు అక్కడినుంచి పరారయ్యరు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. దివ్య డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. నూకరాజు కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం కాకినాడ టౌన్ లో సంచలనంగా మారింది.