Begin typing your search above and press return to search.

ఇంటికి పిలిచి చంపేసి.. 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు

చంపేసిన అనంతరం అతడ్ని 400 ముక్కలుగా నరికేసి.. శరీర భాగాల్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఆమానుష ఘటన బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:07 AM GMT
ఇంటికి పిలిచి చంపేసి.. 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు
X

విన్నంతనే ఒళ్లు జలదరింపునకు గురయ్యే ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. గొడవ పడిన యువకుడ్ని రాజీ కోసం తమ ఇంటికి రావాలని ఆహ్వానించి..అనూహ్యంగా చంపేయటం ఒక ఎత్తు అయితే.. చంపేసిన అనంతరం అతడ్ని 400 ముక్కలుగా నరికేసి.. శరీర భాగాల్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఆమానుష ఘటన బయటకు వచ్చింది. ఢిల్లీ కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ ను ఆమె ప్రియుడు ఏ రీతిలో అయితే.. హతమార్చాడో.. అదే తీరును తాజా ఉదంతంలో కనిపిస్తుంది. హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత కానీ ఈ దుర్మార్గం బయటకు రాకపోవటం గమనార్హం.

విన్నంతనే గగుర్పాటుకు గురయ్యే ఈ ఉదంతంలోకి వెళితే.. గ్వాలియర్ జిల్లా బహదుర్ పుర గ్రామానికి చెందిన రాజు ఖాన్ కు అదే ప్రాంతానికి చెందిన కల్లు ఖాన్.. నజీంఖాన్ అనే తండ్రీ కొడుకులతో గొడవైంది. ఇది కాస్తా కేసుగా నమోదైంది. దీంతో.. తమపై కేసు పెట్టిన రాజు ఖాన్ తో రాజీ కోసం తమ ఇంటికి రావాలని కోరారు. రాజీలో భాగంగారూ.20వేలు ఇవ్వాలన్న రాజు ఖాన్ డిమాండ్ కు ఓకే చెప్పారు తండ్రీకొడుకులు.

ఇంటికి వచ్చిన రాజు ఖాన్ ను మాట్లాడుతున్నట్లుగా నటించి.. డంబెల్ తో అతడి నెత్తి మీద బలంగా మోదారు. దీంతో అతను కింద పడిపోగా.. అనంతరం చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కులుగా చేసి 15 ప్రాంతాల్లో సంచుల్లో తీసుకెళ్లి పడేశారు. ఈ దారుణ ఉదంతం సెప్టెంబరు రెండు.. మూడు వారాల మధ్య జరిగింది. అయితే.. సెప్టెంబరు గుర్తు తెలియని యువకుడి మొండెం స్థానిక మురుగుకాలువలో కనిపించటం సంచలనంగా మారింది. దీన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఈ తండ్రీకొడుకుల దుర్మార్గం బయటకు వచ్చింది. అయితే.. రాజుఖాన్ ను హతమార్చిన తర్వాత అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. వారి కోసం వెతికిన పోలీసులు ఇటీవల వారిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో తాము చేసిన దుర్మార్గాన్నిపోలీసులకు వివరించారు. రాజు ఖాన్ ను చంపేసిన తర్వాత 400 ముక్కలుగా నరికి.. 15 సంచుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లుగా చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి.