Begin typing your search above and press return to search.

బెంగళూరులోని ఆంధ్రా టెక్కీ... భార్య, కూతుళ్ల మృతదేహాలతో జీవనం!

తన భార్య పిల్లలను హత్యచేసిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మూడు రోజులపాటు ఆ మృతదేహాలతోనే జీవించాడు

By:  Tupaki Desk   |   5 Aug 2023 9:45 AM GMT
బెంగళూరులోని ఆంధ్రా టెక్కీ... భార్య, కూతుళ్ల మృతదేహాలతో జీవనం!
X

తాజాగా బెంగళూరులో ఒక ఘోరమైన విషయం వెలుగు చూసింది. తన భార్య, పిల్లలను హత్యచేసిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్... మూడు రోజులపాటు ఆ మృతదేహాలతోనే జీవించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్!

అవును... తాజాగా బెంగళూరులో ఒక ఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (31).. కడుగోడిలోని సీగేహళ్లిలోని తన అపార్ట్మెంట్‌ లో భార్య (29). 18 నెలలు, 8 నెలల వయసున్న వారి ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నాడు. ఈ సమయంలో ఆ ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఈ సమయంలో ఆ ఇంట్లో ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్‌ కు ఉరివేసుకుని కనిపించాడు. ఆ గదిలో కుల్లిన స్థితిలో అతడి భార్య మృతదేహంతో పాటు అతడీ చిన్న పిల్లల మృత దేహాలూ అక్కడే ఉన్నాయి. దీంతో అతడి ఫోన్, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులకు కీలక విషయాలు తెలుసుకున్నారని తెలుస్తుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుండలహళ్లిలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేస్తున్న ఆ టెక్కీ... కొన్నేళ్ల క్రితం షేర్ల వ్యాపారంలోకి దిగి భారీగా నష్టపోయాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుండేవని అంటున్నారు.

ఇలా షేర్ల వ్యాపారం వల్ల టెక్కీ అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. అతని ల్యాప్‌ టాప్, మొబైల్‌ ను పరిశీలించిన తర్వాత పోలీసులకు ఈ విషయం తెలిసిందని అంటున్నారు.

ఈ సమయంలో జులై 31న టెక్కీ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు తన ఇద్దరు కూతుళ్లను చేతి టవల్ తో గొంతునొక్కి హత్య చేశాడు. వారిని చంపిన తర్వాత మూడు రోజుల పాటు మృతదేహాలతో జీవించిన అతడు.. ఆగస్టు 2న సీలింగ్ ఫ్యాన్‌ కు ఉరివేసుకున్నాడు. స్థానికంగా ఈ విషయం సంచలనంగా మారింది.