Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. భీమా కూడా అస్సలు తగ్గట్లే..

బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న భీమా మూవీ పాజిటివ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు మార్నింగ్ షో కన్నా మ్యాటీ షోకు వసూళ్లు పెరిగాయి.

By:  Tupaki Desk   |   9 March 2024 10:16 AM GMT
బాక్సాఫీస్.. భీమా కూడా అస్సలు తగ్గట్లే..
X

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మ్యాచో స్టార్ గోపీచంద్‌.. భీమా మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయన్లు గా నటించారు. పురాణాల్లోని పరశురాముడి కథ నేపథ్యంతో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా కన్నడ డైరెక్టర్ హర్ష ఈ సినిమాను తెరకెక్కించారు.

భీమా మూవీ విడుదలకు ముందే ప్రమోష్లనను భారీగా నిర్వహించారు మేకర్స్. టీజర్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో మేకర్స్ ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రా కలిపి 600 థియేటర్లలో, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌ లో 200 స్క్రీన్లలో కలిపి మొత్తంగా 900 స్క్రీన్లలో భీమాను విడుదల చేశారు.

బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న భీమా మూవీ పాజిటివ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు మార్నింగ్ షో కన్నా మ్యాటీ షోకు వసూళ్లు పెరిగాయి. ఇక సెకండ్ షోకు అయితే అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అలా క్రమంగా వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. లాంగ్ వీకెండ్ ఉండటం, రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడంతో గోపీచంద్ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

టాక్ తో సంబంధం లేకుండా భీమా వసూళ్లు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు సినీ పండితులు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో స్టార్ నటీనటులు యాక్ట్ చేయడంతోపాటు టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఈవెంట్ల ఖర్చులతో కలిపి రూ. 30 కోట్ల బడ్జెట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.25 కోట్లను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

స్టోరీ లైన్ ఇదే..

పరశురాముడు కొలువైన మహేంద్రగిరిలో భవానీ(ముకేశ్ తివారీ) ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడుతుంది. ప్రజలను భయపెడుతూ, పోలీసులను చంపేస్తుంటోంది. ఆ ప్రాంతానికి హీరో గోపీచంద్ ఎస్ ఐ గా వస్తాడు. ముకేశ్ ముఠాను అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు. అట‌వీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంక‌ర్ల‌పై కన్నేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ముఠా ఏం చేసింది? ప‌ర‌శురామ క్షేత్రం తెరుచుకుందా? అనేది మిగతా సినిమా.