Begin typing your search above and press return to search.

రెబెల్ ఎంపీ మీద రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ ఎంవీవీ?

నా ఫ్యామిలీ మీద నీవెందుకు లేఖ రాశావంటూ ఎంవీవీ తనకు ఎదురుపడిన రెబెల్ ఎంపీ రఘురామ మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు.

By:  Tupaki Desk   |   20 July 2023 10:25 AM GMT
రెబెల్ ఎంపీ మీద రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ ఎంవీవీ?
X

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈసారి సమావేశాల్లో అధికార బీజేపీ విపక్ష కాంగ్రెస్ సహా ఇతర పక్షలా మధ్య భారీ సమరం సభ సాక్షిగా ఉంటుందని అంతా భావిస్తున్న సంగతి విధితమే.

అయితే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మాత్రం ఎవరూ ఊహించని మరో యుద్ధానికి తెర లేచింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒక్కసారిగా దూసుకుని వచ్చి తిట్ల పురాణం అందుకున్నారు.

అసభ్య పదజాలంతో రెబెల్ ఎంపీని దారుణంగా దూషించారు. ఇంతకీ మ్యాటర్ ఎంటి అంటే గత నెలలో ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ విశాఖలో కిడ్నాప్ కి గురి అయ్యారు. దాని మీద రఘురామ లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసి ఆ కిడ్నాప్ ఉదంతం మీద విచారణ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది.

నా ఫ్యామిలీ మీద నీవెందుకు లేఖ రాశావంటూ ఎంవీవీ తనకు ఎదురుపడిన రెబెల్ ఎంపీ రఘురామ మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు. అంతే కాదు అసలు నీకు సంబంధం ఏమిటి అని కూడా ప్రశ్నించారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దారుణంగా విమర్శిస్తూంటే ఆయన పక్కనే ఉన్న వైసీపీ లోక్ సభ నాయకుడు పి మిధున్ రెడ్డి సైతం మౌనంగా ఉండిపోయారుట.

ఇక రెబెల్ ఎంపీ రఘురామ కూడా తనను సాటి వైసీపీ ఎంపీ దూషిస్తున్నా కూడా అంతా మౌనంగా ఉంటునే వచ్చారని అంటున్నారు. ఆ తరువాత మిధున్ రెడ్డి ఎంవీవీకి నచ్చచెప్పి అక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళారని అంటున్నారు. ఇక ఇద్దరు తెలుగు ఎంపీలు ఈ విధంగా తగాదా పడుతూ మాటలతో దూషించుకోవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీలు అంతా ఇటు వైపే చూస్తూండిపోయారట.

నిన్ను చంపేస్తా అని తనను ఎంవీవీ బెదిరించారని రెబెల్ ఎంపీ అనంతరం లోక్ సభ స్పీకర్ కి ఎంవీవీ మీద ఫిర్యాదు చేశారని అంటున్నరు. ఇదిలా ఉండగా రెబెల్ ఎంపీ రఘురామకు వైసీపీ ఎంపీల నుంచి ఈ దూషణలు ఇది మొదటి సారి కాదు, గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇదే తీరున పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజు గారి మీద విరుచుకుపడ్డారని అంటున్నారు.

ఇలా ఇద్ద్దరు ఎంపీలు ఈ విషయంలో చేసిన రగడ అంతా రెబెల్ ఎంపీ మీదనే అయితే అసలు తెలుగు ఎంపీలు అంతా కలసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ విధంగా కాట్లాటకు దిగడం తో పరువు పోతోంది అని అంటున్నారు. మొత్తానికి రఘురామ లోక్ సభ స్పీకర్ కి ఎంవీవీ మీద చేసిన ఫిర్యాదు మీద యాక్షన్ ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఇది మంచి పరిణామం కాదనే అక్కడ ఉన్న మిగిలిన ఎంపీలు అంటున్నారుట.