రూ.75లక్షల కోట్ల నాణెం ముద్రణకి అమెరికా ప్రయత్నం.. ఎందుకంటే !
ఒకప్పటి నాణెలకు ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఒక్కప్పటి రూపాయి నాణెం కూడా వేలం వేస్తే లక్ష రూపాయలైనా పెట్టి కొంటారు కొందరు. ఇప్పటి నాణెలకు అంత విలువ ఉండదు. కానీ అమెరికా మాత్రం ట్రిలియన్ డాలర్లు పెట్టి ఒక నాణెన్ని ముద్రించాలనే ఆలోచనలో ఉందట. ట్రిలియన్ డాలర్లంటే ఇండియన్ కరెన్సీ లో అక్షరాల రూ. 75 లక్షల కోట్లు. ఇంతకీ అంత ఖర్చు పెట్టి నాణెన్ని తయారు చేయాలనే నిర్ణయం అమెరికా ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారా, రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా చట్టం ప్రకారం.. ప్లాటినంతో చేసిన నాణెం ద్వారా ప్రభుత్వం ఎంత రుణం అయినా తీసుకోవచ్చు.
ఈ ట్రిలియన్ డాలర్ల నాణెన్ని ఖజానాలో పెడితే ప్రభుత్వం ఎంత రుణం అయినా పొందవచ్చు. దీంతో రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు పెరుగుతాయి. అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనే దానిపై నిబంధనే డెట్ సీలింగ్ అంటారు. ఈ సొమ్మును వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీనికి కాంగ్రెస్ అనుమతి ఉండాలి. లేకపోతే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వెచ్చించే మొత్తం ఎక్కువైపోతుంది. 1917లో తొలిసారి దీనిని అమెరికా ప్రవేశపెట్టింది. కానీ, 1960 తర్వాత నుంచి డెట్ సీలింగ్ ను 78 సార్లు పెంచారు. ప్రస్తుతం 22 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 28.5 మిలియన్ డాలర్లకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ సారి అక్టోబర్ 18 నాటికి ఆమోదించాల్సిన బడ్జెట్ లో అమెరికాకు దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల సొమ్ము తగ్గింది. ఇందుకోసం ట్రిలియన్ డాలర్లు విలువైన ఓ ప్లాటినం కాయిన్ ను ముద్రించమని బైడెన్ సర్కారు కోరవచ్చు. 2011లో చేసిన ఓచట్టం అధ్యక్షుడికి ఆ అధికారం ఇచ్చింది. దీని ప్రకారం బంగారం, వెండి, నికెల్,రాగి,కంచు కాకుండా ప్లాటినంతో చేసిన నాణెనికి ఎంత విలువ అయినా ప్రభుత్వం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు మింట్ లో ట్రిలియన్ డాలర్ల విలువైన కాయిన్ ను ముద్రించే అవకాశం ఉంది. దానిని ఖజానాలో పెట్టి అమెరికా ప్రభుత్వం మరో ట్రిలియన్ డాలర్లు తీసుకొనే అవకాశం ఉంది.
గతంలో ఒబమా సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 2011లో ఈ విధంగా ప్లాటినం కాయిన్ తయారు చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఒబామానే ‘పాడ్ సేవ్ అమెరికా’ అనే పాడ్ కాస్ట్లో వెల్లడించారు. కాకపోతే ఇది ఒక రాతియుగపు ఆలోచన అని ఆయన అభివర్ణించారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ అలెన్ మాట్లాడుతూ బైడెన్ ట్రిలియన్ డాలర్ల ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రకమైన పనులు చేసి, అప్పులను అమెరికా ఎలా చెల్లిస్తుందో ప్రపంచానికి చూపించడం అవసరమా,? అని అలెన్ వ్యాఖ్యనించారు. అంతేకాదు అమెరికన్ ఫెడ్ రిజర్వుపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఈ ట్రిలియన్ డాలర్ల కాయిన్ దెబ్బతీస్తుందన్నారు.
ఈ ట్రిలియన్ డాలర్ల నాణెన్ని ఖజానాలో పెడితే ప్రభుత్వం ఎంత రుణం అయినా పొందవచ్చు. దీంతో రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు పెరుగుతాయి. అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనే దానిపై నిబంధనే డెట్ సీలింగ్ అంటారు. ఈ సొమ్మును వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీనికి కాంగ్రెస్ అనుమతి ఉండాలి. లేకపోతే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వెచ్చించే మొత్తం ఎక్కువైపోతుంది. 1917లో తొలిసారి దీనిని అమెరికా ప్రవేశపెట్టింది. కానీ, 1960 తర్వాత నుంచి డెట్ సీలింగ్ ను 78 సార్లు పెంచారు. ప్రస్తుతం 22 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 28.5 మిలియన్ డాలర్లకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఈ సారి అక్టోబర్ 18 నాటికి ఆమోదించాల్సిన బడ్జెట్ లో అమెరికాకు దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల సొమ్ము తగ్గింది. ఇందుకోసం ట్రిలియన్ డాలర్లు విలువైన ఓ ప్లాటినం కాయిన్ ను ముద్రించమని బైడెన్ సర్కారు కోరవచ్చు. 2011లో చేసిన ఓచట్టం అధ్యక్షుడికి ఆ అధికారం ఇచ్చింది. దీని ప్రకారం బంగారం, వెండి, నికెల్,రాగి,కంచు కాకుండా ప్లాటినంతో చేసిన నాణెనికి ఎంత విలువ అయినా ప్రభుత్వం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు మింట్ లో ట్రిలియన్ డాలర్ల విలువైన కాయిన్ ను ముద్రించే అవకాశం ఉంది. దానిని ఖజానాలో పెట్టి అమెరికా ప్రభుత్వం మరో ట్రిలియన్ డాలర్లు తీసుకొనే అవకాశం ఉంది.
గతంలో ఒబమా సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 2011లో ఈ విధంగా ప్లాటినం కాయిన్ తయారు చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఒబామానే ‘పాడ్ సేవ్ అమెరికా’ అనే పాడ్ కాస్ట్లో వెల్లడించారు. కాకపోతే ఇది ఒక రాతియుగపు ఆలోచన అని ఆయన అభివర్ణించారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ అలెన్ మాట్లాడుతూ బైడెన్ ట్రిలియన్ డాలర్ల ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రకమైన పనులు చేసి, అప్పులను అమెరికా ఎలా చెల్లిస్తుందో ప్రపంచానికి చూపించడం అవసరమా,? అని అలెన్ వ్యాఖ్యనించారు. అంతేకాదు అమెరికన్ ఫెడ్ రిజర్వుపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఈ ట్రిలియన్ డాలర్ల కాయిన్ దెబ్బతీస్తుందన్నారు.