ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్ !

Update: 2020-08-03 08:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింత భయంకరంగా రూపాంతరం చెందుతుంది. రోజురోజుకూ నమోదు అయ్యే కేసుల సంఖ్య చూస్తుంటే అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇండియా లో ప్రతిరోజూ కూడా 50 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విజృంభణ తో దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో నడుస్తున్నాయి.  ఈ కరోనా వ్యాధి సోకిన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీనితో ఎంతోమంది ఉద్యోగాలు పోయి , జీవితాన్ని సాగించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.  దీంతో పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది ఇబ్బందులు  పడుతూ .. ఆత్మహత్యకి పాల్పడుతున్నారు.  అందులో కొందరు సెలబ్రిటీలు సైతం ఉన్నారు.

ఇక తాజాగా ఓ 24 ఏళ్ల టీవీ యాంకర్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోన్న ప్రియా జునీజా.. గత శుక్రవారం ఉదయం ఎంతసేపైనా బయటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు పగలగొట్టగా ప్రియా ఫ్యాన్‌ కి ఉరేసుకొని విగతజీవిగా తాడుకి వ్రేలాడుతూ కనిపించింది.  ఇకపోతే , ప్రియా పలు ఛానెళ్లలో న్యూస్‌ రీడర్‌ గా, యాంకర్‌ గా   పనిచేశారు. కరోనా నేపథ్యంలో ఆమె ఉద్యోగం పోగా, ఆ తరువాత యూట్యూబ్‌ ఛానెల్ ‌ని ప్రారంభించింది. అయితే దానికి అనుకున్నంత మైలేజ్ రాలేదు, దానితో‌  డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రియా, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతిపై సన్నిహితులు సంతాపం ప్రకటించారు.
Tags:    

Similar News