ఎమ్మెల్యే ఆళ్ల ఆఫీసులో చోరీ.. సోంతోళ్ల పనేనా?

Update: 2019-11-19 05:48 GMT
మంగళగిరి ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసులో చోరీ చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. సంక్షేమ కార్యక్రమాల కోసం ఆఫీసులో ఉంచిన రూ.10లక్షల మొత్తం చోరీ అయినట్లు గుర్తించారు.

కచ్ఛితంగా ఈ ఉదంతం పార్టీ ఆఫీసులో పని చేసే వారు చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10లక్షల మొత్తం చోరీ అయినట్లుగా గుర్తించిన పార్టీ ఆఫీసు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన మంగళగిరి అర్బన్ సీఐ నరేష్ కుమార్ ఫిర్యాదు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

పార్టీ ఆఫీసులో పని చేసే ఉద్యోగులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరుపుతున్నారు. రూ.10లక్షలు దోచేసిన పార్టీ ఇంటి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags:    

Similar News