భార్య మృతికి భర్త మాస్టర్ ప్లాన్ .. రక్తపింజరితో చావలేదని నాగుపాముతో

Update: 2021-08-31 00:30 GMT
కేరళ రాష్ట్రంలో  సంచలనం సృష్టించిన ఉతారా హత్య కేసులో తాజాగా కీలక పరిణామ చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి కోర్టు తీర్పు వచ్చే వారం చెప్పనుంది. ఆ  తీర్ప ఎలా ఉండనుందా అని అంతా ఉత్కంఠగా వేచి చూస్తున్న తరుణంలో తాజాగా సీన్‌ రీ కంస్ట్రక్షన్  సందర్భంగా తీసిన వీడియోను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వీడియోను కోర్టులో ప్రవేశపెట్టారు. వీడియోలో ఓ డమ్మీ బొమ్మను పడుకోబెట్టి పాము చేత కాటు వేయించారు. ఒకటిన్నర ఏడాది క్రితం అత్తింటి వారినుంచి అదనపు కట్నం ఆశించిన అల్లుడు అది దక్కకపోయే సరికి తాళి కట్టిన భార్యను పాములతో కాటేయించి హత్య చేసిన ఘటన కేరళలో సంచలనం సృష్టించింది.

అదనపు కట్నం కోసం సూరజ్ ఉతారాను వేధించటం మొదలెట్టాడు. ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. తనకు తెలిసిన పాములు పట్టే వ్యక్తి వద్దనుంచి పామును కొనుగోలు చేశాడు. భార్య నిద్ర పోతున్న సమయంలో బెడ్ రూమ్ లోకి పాము వదిలి వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఆ పాము ఉతారాను  కాటు వేసింది. పాము కాటేయడం గమనించిన ఆమె, స్ధానికుల సహాయంతో ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. తోలి ప్రయత్నం విఫలం కావటంతో …ఇది జరిగిన నెల రోజులకు సూరజ్ మళ్లీ సేమ్ ప్లాన్ అమలు చేశాడు. పాములు పట్టేవాడి దగ్గర ఇంకో పామును కొనుగోలు చేసి ఆమె నిద్రిస్తున్న సమయంలో పడకగదిలో వదిలేసి వెళ్లిపోయాడు. రెండోసారి పాము కాటుకు గురైన ఉతారా కన్నుమూసింది. పాము కాటుతో భార్య మరణించిందని ఏడుస్తూ అందరినీ నమ్మించి ఆమె అంత్యక్రియలు పూర్తిచేశాడు.
Read more!

అయితే , అప్పటికే అల్లుడు వరకట్నం గురించి వేధిస్తున్నవిషయం తెలిసిన ఉతారా తల్లితండ్రులకు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు. గది తలుపులు, కిటికీలు మూసి ఉండగా పాము ఆ గదిలోకి ఎలా వెళ్లింది అనే ప్రశ్న వారిని వేధించింది. పైగా ఒకసారి కాదు అతి తక్కువ సమయంలో రెండుసార్లు పాము కాటుకు గురవ్వటంపై అనుమానం పెరిగిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. చివరికి భార్యను తానే హత్య చేసినట్లు సూరజ్ ఒప్పుకున్నాడు. రెండు పాములను 10వేల రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పాడు. సూరజ్ తోపాటు అతడికి పాములు విక్రయించిన సురేష్ ని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు.
Tags:    

Similar News