పదోతరగతి విద్యార్థినిపై గ్యాగ్ రేప్.. వీడియో తీసి మరీ మళ్లీమళ్లీ అఘాయత్యం

Update: 2022-11-29 08:42 GMT
హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ దారుణం హయత్ నగర్ లోని తట్టిఅన్నారంలో చోటుచేసుకుంది.

పదోతరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు.

పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితులు అంతా మైనర్లే కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు.

ఇక గతంలోనూ ఒక యువతిని కార్ లో ఇలాగే గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పుడు కూడా విద్యార్థిని ఇలాగే మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. పురుషుల వలలో పడవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News