అమెరికా మరోసారి కాల్పుల కలకలం: ముగ్గురు మృతి..

Update: 2022-05-16 03:50 GMT
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది మరణించిన ఘటన మరువక ముందే మరోసారి తుపాకీ మోతలతో అమెరికా దద్దరిల్లింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో దుండగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 8మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదివారం న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో సైనికుడి వేషధారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

దీంతో అక్కడికక్కడే పది మంది ప్రాణాలు కోల్పోయారు.జాతివివక్షనే ప్రధాన కారణంగా చెబుతున్నారు.ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు.

ఇక తాజాగా హోస్టన్ సూపర్ మార్కెట్ లో ఐదుగురు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం చెలరేగింది. తుపాకులతో కాల్చుకున్నారు.  ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు.

నిందితుల్లో ఒకరు ఆస్పత్రి పాలు కాగా.. మరో ఇద్దరిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో అమాయక ప్రజలు ఎవరూ గాయపడలేదని తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 20 ఏళ్ల వయసులోపు వారేనని పోలీసులు తెలిపారు.

కాలిఫోర్నియా నగరంలోని చర్చ్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Tags:    

Similar News