టీసీఎస్ కొత్త బెంచ్ పాలసీ: 35 రోజులు మాత్రమే అనుమతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు కీలకమైన కొత్త నిబంధనను తీసుకొచ్చింది.;

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు కీలకమైన కొత్త నిబంధనను తీసుకొచ్చింది. జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా పాలసీ ప్రకారం ఉద్యోగులు బెంచ్పై గడిపే కాలాన్ని గరిష్టంగా 35 రోజులకు పరిమితం చేసింది. దీంతోపాటు సంవత్సరానికి కనీసం 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేయాలని తప్పనిసరిగా నిబంధన విధించింది.
-ఎందుకు ఈ కొత్త నిబంధనలు?
ఈ మార్పులు తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశ్యం వర్క్ఫోర్స్ను సమర్థవంతంగా వినియోగించుకోవడమేనని తెలుస్తోంది.. గతంలో కొన్ని నెలలు పాటు కూడా ఉద్యోగులు బెంచ్ మీద గడిపే పరిస్థితులు కనిపించేవి. కానీ ఇప్పుడు 35 రోజులు దాటి ఉంటే ఆ ఉద్యోగి కెరీర్, వేతనం, భవిష్యత్పై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ పాలసీ డాక్యుమెంట్లో స్పష్టంగా తెలిపింది.
-బిల్ల్డ్ డేస్ అంటే ఏమిటి?
ఐటీ రంగంలో బిల్ల్డ్ డేస్ అంటే క్లయింట్ ప్రాజెక్టులపై నేరుగా పనిచేసే రోజులు. ఇవి ఏడాదికి కనీసం 225 రోజులు ఉండాలని టీసీఎస్ తాజాగా నిర్ణయించింది. అంటే ఉద్యోగులు ఎక్కువ సమయం యాక్టివ్గా ప్రాజెక్టులపై పనిచేయాలని, ఖాళీ సమయం (బెంచ్ పీరియడ్) తగ్గించాలని సంస్థ అభిప్రాయపడుతోంది.
-రొటీన్ ఎలా మారనుంది?
బెంచ్పై ఉన్న ఉద్యోగులు సంస్థ అందిస్తున్న ఐఎవాల్వ్, ఫ్రెస్కో ప్లే, వీఎల్ఎస్, లింక్డిన్ వంటివి ప్లాట్ఫామ్ల ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. అలాగే RMG (రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్) నిర్దేశించిన సెషన్లకు హాజరవ్వాలి. బెంచ్లో ఉన్నపుడు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి హాజరుకావాలి. వర్క్ ఫ్రం హోమ్, ఫ్లెక్సిబుల్ వర్క్ వంటి లాభాలు వర్తించవు.
-ఆర్ఎంజీ పాత్ర ఏంటి?
టీసీఎస్లోని రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (RMG) అసోసియేట్ల నైపుణ్యాలు, అవసరాలను బట్టి సరిపోయే ప్రాజెక్టులు కేటాయించే బాధ్యత వహిస్తుంది. గ్లోబల్ హెడ్గా చంద్రశేఖరన్ రామ్కుమార్ నేతృత్వంలో ఈ పాలసీ రూపుదిద్దుకుంది. ఏ ఉద్యోగి బెంచ్పైన ఉంటే, తగిన ప్రాజెక్ట్ కేటాయించేందుకు యూనిట్/రిజినల్ RMG తో చర్చించి నిర్ణయం తీసుకోవడం అవసరం.
-పాలసీ ఉల్లంఘిస్తే..?
ఎవరైనా ఉద్యోగి దీర్ఘకాలంగా ప్రాజెక్ట్ లేని స్థితిలో ఉంటే టీసీఎస్ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఈ పాలసీలో పేర్కొంది. అంటే ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
మొత్తంగా ఈ కొత్త విధానం ద్వారా టీసీఎస్ తన వర్క్ ఫోర్స్ను మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా అడుగులు వేసింది. ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని వేగంగా ప్రాజెక్ట్లలో చేరేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఏర్పడింది.