SSMB 29.. 120 దేశాల్లో రిలీజ్.. గ్లోబల్ మూవీనే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు.;

Update: 2025-09-03 05:18 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. సైలెంట్ గా షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసేస్తున్నారు మన జక్కన్న.

ప్రస్తుతం మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని రాజమౌళి సహా మూవీ టీమ్‌ మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు కెన్యా మినిస్టర్. అదే సమయంలో పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకోగా.. అవి వైరల్ గా మారాయి.

సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా అగ్ర దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారంటూ రాసుకొచ్చారు. "అనేక పవర్ ఫుల్ స్టోరీస్, అద్భుతమైన విజువల్స్ తో సినిమాలు తీశారు. లోతైన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఈస్ట్ ఆఫ్రికా మొత్తం పర్యటించారు. 120 మందిని క్రూలోకి తీసుకున్నారు" అని చెప్పారు.

ఆసియాలోనే అతిపెద్ద మూవీగా తెరకెక్కుతున్న మహేష్- జక్కన్న సినిమాలో మసాయిమరా మైదానాలు, నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు భాగం కాబోతున్నాయని తెలిపారు. 120 దేశాల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, మూవీ 100 కోట్ల మందికి పైగా చేరువయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు.

"కెన్యాలో ఆ మూవీ షూటింగ్‌ చేయడం ఒక మైలురాయిగా నిలుస్తోంది. ప్రపంచ వేదికపై కెన్యా అందాలను, ఆతిథ్యాన్ని, అందమైన ప్రాంతాలను ప్రపంచానికి చూపెట్టడంలో SSMB 29 పవర్ ఫుల్ గా పనిచేయనుంది. కెన్యా తన చరిత్రను వరల్డ్ వైడ్ గా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ విషయంలో తమ దేశం చాలా గర్వపడుతుంది" అని చెప్పారు.

ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జక్కన్న ప్రాంతీయ సినిమా బాహుబలిని పాన్ ఇండియా మూవీగా మార్చారని, ఇప్పుడు SSMB 29ను గ్లోబల్ సినిమాగా మార్చుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. అయితే కెన్యాలో రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది.

కాగా, సినిమా విషయానికొస్తే.. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో మూవీ సాగనుంది. మహేష్ బాబుతోపాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. నెవ్వర్ బిఫోర్ అనేలా కొత్త వరల్డ్ ను రాజమౌళి చూపించనున్నారు.

Tags:    

Similar News