భైరవం రిలీజ్.. ఖలేజా రీ రిలీజ్.. మనోజ్ ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ తో పాటు మనోజ్ నటించారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది మూవీ.
అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ రీ రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఆ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత కల్ట్ స్టేటస్ పొందింది. ఇప్పుడు రీ రిలీజ్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబట్టి.. కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
మహేష్ బాబు ఫ్యాన్స్.. థియేటర్స్ లో పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా ఖలేజా రీ రిలీజ్ లో మాసివ్ రెస్పాన్స్ అందుకోగా.. ఆ ఎఫెక్ట్ భైరవంపై పడిందని టాక్ వచ్చింది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో తేడాలు కనిపించాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
ఇప్పుడు ఆ విషయంపై మంచు మనోజ్ స్పందించారు. రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో విడుదల చేస్తే బాగుంటుందని మనోజ్ అభిప్రాయపడ్డారు. అలా చేస్తే కొత్త సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. వీకెండ్స్ లో విడుదల చేస్తే మనమే ఓ మూవీని మరో మూవీతో చంపేసినట్లు ఉంటుందన్నారు.
అదే సమయంలో ఎలాగైనా ఏ సినిమాకు ఉండాల్సిన బలం.. ఆ సినిమాలకు ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వీకెండ్స్ లోనే అందరికీ ఫ్రీ టైమ్ దొరుకుతుందని తెలిపారు. అందుకే రీ రిలీజ్ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రీ రిలీజ్ ల విషయంలో కాస్త పునరాలోచించాలని ఆయన కోరారు.
ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు ఆయన ఇప్పుడు సిద్ధమవుతున్నారు. భైరవంతో మంచి ప్రశంసలు అందుకున్నారు. తేజ సజ్జా మిరాయ్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారు. దాంతోపాటు రక్షక్, వాట్ ది ఫిష్ వంటి వివిధ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.