ఆ సినిమాకు గుడ్ బై చెప్పిన యంగ్ హీరో

Update: 2018-11-14 07:15 GMT
యంగ్ హీరో సుధీర్ బాబు ఈమధ్య ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగుతున్నాడు.  మహేష్ బాబు బావ అని మాత్రమే కాకుండా సొంతంగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. 'సమ్మోహనం'.. 'నన్ను దోచుకుందువటే' సినిమాలు సుధీర్ బాబుకి ప్రశంసలు తెచ్చిపెట్టాయి. తాజాగా సుధీర్ బాబు లేటెస్ట్ ఫిలిం గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.  

ప్రొడ్యూసర్ రిజ్వాన్ నిర్మాణంలో ఆగష్టు లో సుధర్ బాబు కొత్త సినిమాను లాంచ్ చేశారు.  మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్.   ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సుధీర్ బాబు డ్రాపయ్యాడట.  నిర్మాతతో అభిప్రాయభేదాలు కారణంగానే సుధీర్ బాబు ఈ సినిమాకు గుడ్ బై చెప్పాడని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు తీసుకున్నా అడ్వాన్సు అమౌంట్ రూ.25 లక్షలు నిర్మాతకు వెనక్కి ఇచ్చాడట.

పులి వాసు - రిజ్వాన్ సినిమాను వేరు హీరో తో ప్లాన్ చేస్తున్నారా లేదా పక్కనబెట్టేశారా అన్నది ఇంకా తెలియదు. ఈ సినిమానుండి బయటకు వచ్చేసిన తర్వాత పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సుధీర్ రెడీ అవుతున్నాడు.  స్వతహాగా బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సుధీర్ పుల్లెల గోపీచంద్ సినిమాకు మళ్ళీ కోర్టుకు వచ్చి బ్యాడ్మింటన్ ప్రాక్టీసు చేసయం చాలా అనందంగా ఉందని.. బ్యాడ్మింటన్ తన ఫస్ట్ లవ్ అని ఈమధ్యనే తెలిపాడు.  
    

Tags:    

Similar News