ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసినదే. ఓవైపు రాధేశ్యామ్ నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. సేమ్ టైమ్ రిలీజ్ ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటే మరో రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సలార్ పైనే. పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాని తెరపైకి తెస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ఈ సినిమాని పరిమిత షెడ్యూళ్లలో తక్కువ సమయంలోనే పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో కాల్షీట్లు లాక్ అయ్యాయి. సలార్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ఈ చిత్రం గత వారం హైదరాబాద్ లో అధికారిక పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రకటన వెలువడినప్పటి నుండి ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దిషా పటానీ కథానాయికగా నటించనుందని గుసగుసలు వినిపించాయి. కానీ దానిని మేకర్స్ ధృవీకరించలేదు.
తాజా సమాచారం ప్రకారం.. దిషా పటానీ స్థానంలో శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ - శ్రుతి ఇప్పటివరకు జంటగా నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్ ఆసక్తిని కలిగిస్తుందని భావిస్తున్న ప్రశాంత్ నీల్ `సలార్` కోసం శ్రుతిని సంప్రదించారు. అలాగే శ్రుతి హాసన్ పాన్-ఇండియన్ పాపులారిటీ కోసం ఆసక్తిగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది.
శ్రుతి సలార్ లో భాగం కావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. తన కెరీర్ లో మునుపెన్నడూ చేయని ఓ డిఫరెంట్ పాత్రలో నటించే అవకాశాన్ని చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదట. హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగదూర్ రాజీ అన్నదే లేకుండా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సలార్ పైనే. పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాని తెరపైకి తెస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ఈ సినిమాని పరిమిత షెడ్యూళ్లలో తక్కువ సమయంలోనే పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో కాల్షీట్లు లాక్ అయ్యాయి. సలార్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ఈ చిత్రం గత వారం హైదరాబాద్ లో అధికారిక పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రకటన వెలువడినప్పటి నుండి ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దిషా పటానీ కథానాయికగా నటించనుందని గుసగుసలు వినిపించాయి. కానీ దానిని మేకర్స్ ధృవీకరించలేదు.
తాజా సమాచారం ప్రకారం.. దిషా పటానీ స్థానంలో శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ - శ్రుతి ఇప్పటివరకు జంటగా నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్ ఆసక్తిని కలిగిస్తుందని భావిస్తున్న ప్రశాంత్ నీల్ `సలార్` కోసం శ్రుతిని సంప్రదించారు. అలాగే శ్రుతి హాసన్ పాన్-ఇండియన్ పాపులారిటీ కోసం ఆసక్తిగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది.
శ్రుతి సలార్ లో భాగం కావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. తన కెరీర్ లో మునుపెన్నడూ చేయని ఓ డిఫరెంట్ పాత్రలో నటించే అవకాశాన్ని చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదట. హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగదూర్ రాజీ అన్నదే లేకుండా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.