నేను మోసం చేయలేదు..ఆమెకే ఆస్తులిచ్చా

Update: 2019-02-04 07:12 GMT
సీనియర్ నటి రమాప్రభ ఈమధ్య కొన్ని ఇంటర్వ్యూలలో తన మాజీ భర్త శరత్ బాబుపై చాలా ఆరోపణలే చేశారు. శరత్ బాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చెన్నైలో తనకంటే పెద్దదైన రమాప్రభతో లివిన్ రిలేషన్ లో ఉండేవారు. అప్పట్లో తన ఆస్తులను మొత్తం బలవంతంగా తీసుకొని శరత్ బాబు మోసం చేశారని రమాప్రభ ఆరోపణలు చేశారు.  ఈ విషయంపై శరత్ బాబు రీసెంట్ గా స్పందించారు.

రమాప్రభకు సంబంధించినవి ఒక్కపైసా విలువ గల ఆస్తులు కూడా తీసుకోలేదని.. ఆమె ఆరోపణలు నిరాధారాలని శరత్ బాబు క్లారిటీ ఇచ్చారు.  తాము చెన్నై లో కలిసి ఉన్న సమయంలో ఆమెకున్న మొత్తం ప్రాపర్టీ ఆళ్వార్ పేట్ లో ఒక ఇల్లు.. ఎగ్మోర్ బెనిఫిట్ సొసైటీలో మరొక ఇల్లు మాత్రమేనన్నారు. రెండో ఇల్లు ఫైనాన్స్ లో ఉండేది అన్నారు.   ఇక తన పొలాన్ని అమ్మి ఆమెకోసం ఉమాపతి స్ట్రీట్ లో ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొన్నానని.. ఇప్పుడు ఆ పొలం విలువ రూ. 60 కోట్లు ఉండొచ్చని అన్నారు. ఆ ఇంటికి మరమ్మత్తులు చేసేందుకు మరో 1-2 లక్షలకు పైగా ఖర్చు చేశానని తెలిపారు.

ఆమెను తానేమీ మోసం చేయలేదని.. నిజానికి తానే ఆమెకు ఆస్తులను ఇచ్చానని తెలిపాడు. ఒకవేళ తన ప్రాపర్టీని వెనక్కు తీసుకుని ఉంటానే తప్ప ఆమెకు సంబంధించిన ఒక్కపైసా కూడా తీసుకోలేదని అన్నాడు.  ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో తన వయసు 22 ఏళ్లని అన్నాడు. రమాప్రభ చెప్పినట్టు ఆమె సోదరుడు అమాయాకుడేమీ కాదని ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పాడు.  ఓవరాల్ గారమాప్రభ చేసిన ఆరోపణలన్నీ ఆధారం లేనివని కొట్టిపారేశాడు.
 


Tags:    

Similar News