2.0 రిలీజ్ అంతా అబద్ధం

Update: 2017-08-20 06:08 GMT
ప్రస్తుతం సౌత్ లో బాహుబలిని మించిన మరో చిత్రం రాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ దర్శకత్వంలో 2.0 గా తేరకెక్కబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు తమిళ్ సినిమా ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే శంకర్ ' శివాజీ -రోబో ' వంటి భారీ హిట్స్  తర్వాత మళ్లీ సూపర్ స్టార్ తో కలిసి సినిమా చేయడం మరో స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన రూమర్స్  వెలువడుతున్నాయి. గత కొన్ని రోజులుగా  సోషల్ మీడియాలో శంకర్ సినిమా లేట్ గా తీస్తున్నాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. దీంతో సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడం లేదని గాసిప్స్ కూడా వినిపించాయి. పైగా గ్రాఫిక్స్ కూడా చాలా లేటవుతోందని టాక్ వచ్చేసింది. కానీ ఈ తరహా వ్యాఖ్యలను చిత్ర యూనిట్ సబ్యులు కొట్టిపారేశారు అవన్నీ వట్టి పుకార్లేనని. ముందుగా చెప్పినట్టుగానే 2018 జనవరి 25కి రాబోతున్నట్లు తెలిపారు. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదని కూడా వారు వివరించారు.

దాదాపు 300 కోట్లతో శంకర్ ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశలో ఉండగా కొన్ని గ్రాఫిక్స్ వర్క్స్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్ పై సుభాస్కరన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News