వివాదాస్పద చిత్రాల దర్శకుడు ఆర్జీవీ రూపొందిస్తున్న మరో వివాదాస్పద చిత్రం `కొండా`. తెలంగాణకు చెందిన కొండా మురళీధర్రావు, సురేఖల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. బుధవారం హన్మకొండలోని కొండా మురళి క్యాంప్ కార్యాలయంలో ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కొండా మురళికి 47 బుల్లెట్లు దిగినట్టుగా చూపించారు. ఆ బుల్లెట్ల వర్షం కురిపించింది ఎవరు? .. అన్ని బుల్లెట్లు దిగినా మృత్యుంజయుడిగా కొండా మురళి ఎలా బ్రతికాడన్నది ప్రతీ ఒక్కరి మదిని తొలుస్తోంది.
ఈ సందర్భంగా కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే ఆయన వంద మందిని ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని సినిమా చేశారన్నారు. రెండు నెలల పదహారు రోజులు వరంగల్ లో ఉండి షూటింగ్ చేశారు. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్ ల వర్షం కురిసిందని, అయినా తాను బ్రతికానని తెలిపారు. అది కూడా తన కుటుంబం కోసం కాదని ప్రజల కోసమన్నారు. ఈ సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బాగుంటుందని, త్రిగుణ్ బాగా నటించాడని, సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా వుందన్నారు.
కొండా సురేఖ సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. ట్రైలర్ చూశాక మేం ఎంత బాధలు అనుభవించామన్నది గుర్తొచ్చి భావోద్వేగానికి లోనయ్యాను. ఆ ఫైరింగ్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు జనవరి 26. నేను వెళ్లేసరికి మురళీగారు వైట్ లాల్చీ పైజమాలో రక్తపు మడుగులో పడి వున్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి వున్నారు. నా కూతురు ఎక్కడ వుందో కనబడలేదు. నన్ను ఆయన దగ్గరికి వెళ్లనివ్వడం లేదు. మరణించాడని అన్నారు.
ఆ రోజు ఆయన మరణించి వుంటే ఈ రోజు మేం ఎక్కడ వుండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ వుండేదో మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా వుంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపుకుంకుమ బలం కొండా మురళిగారు మన ముందు ఉండటం అన్నారు. ఇక ఆర్జీవీ గురించి బయట చెప్పేవన్నీ అబద్ధాలే. ప్రపంచంలో ఆయనకు తెలియని విషయం లేదంటూ ఆర్జీవీపై పొగడ్తల వర్షం కురిపించారు కొండా సురేఖ.
కొండా దంపతులు విప్లవ కారులు.. నేను వాళ్లలా కాదు.. విప్లవకారుడు అయ్యేంత ధైర్యం తనకు లేదని, ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి ఓ ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తుంది. ఇదొక వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. మురళీ జీవితం మీద ఐదారు సినిమాలు తీయొచ్చు.
`కొండా 2`లో మురళీ, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర వుంటుంది. `కొండా` సినిమాలో ఓ టైమ్ పీరియడ్, గెటప్ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా తీశానన్న నమ్మకం వుంది. మార్చిలో సినిమాని విడుదల చేస్తామని వర్మ చెప్పారు.
ఈ సందర్భంగా కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే ఆయన వంద మందిని ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని సినిమా చేశారన్నారు. రెండు నెలల పదహారు రోజులు వరంగల్ లో ఉండి షూటింగ్ చేశారు. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్ ల వర్షం కురిసిందని, అయినా తాను బ్రతికానని తెలిపారు. అది కూడా తన కుటుంబం కోసం కాదని ప్రజల కోసమన్నారు. ఈ సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బాగుంటుందని, త్రిగుణ్ బాగా నటించాడని, సురేఖ కంటే ఇర్రా మోర్ అందంగా వుందన్నారు.
కొండా సురేఖ సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. ట్రైలర్ చూశాక మేం ఎంత బాధలు అనుభవించామన్నది గుర్తొచ్చి భావోద్వేగానికి లోనయ్యాను. ఆ ఫైరింగ్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు జనవరి 26. నేను వెళ్లేసరికి మురళీగారు వైట్ లాల్చీ పైజమాలో రక్తపు మడుగులో పడి వున్నారు. ఆయన చుట్టూ జనం నిలబడి వున్నారు. నా కూతురు ఎక్కడ వుందో కనబడలేదు. నన్ను ఆయన దగ్గరికి వెళ్లనివ్వడం లేదు. మరణించాడని అన్నారు.
ఆ రోజు ఆయన మరణించి వుంటే ఈ రోజు మేం ఎక్కడ వుండేవాళ్లమో? మా కుటుంబం ఎక్కడ వుండేదో మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా వుంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపుకుంకుమ బలం కొండా మురళిగారు మన ముందు ఉండటం అన్నారు. ఇక ఆర్జీవీ గురించి బయట చెప్పేవన్నీ అబద్ధాలే. ప్రపంచంలో ఆయనకు తెలియని విషయం లేదంటూ ఆర్జీవీపై పొగడ్తల వర్షం కురిపించారు కొండా సురేఖ.
కొండా దంపతులు విప్లవ కారులు.. నేను వాళ్లలా కాదు.. విప్లవకారుడు అయ్యేంత ధైర్యం తనకు లేదని, ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి ఓ ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తుంది. ఇదొక వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. మురళీ జీవితం మీద ఐదారు సినిమాలు తీయొచ్చు.
`కొండా 2`లో మురళీ, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర వుంటుంది. `కొండా` సినిమాలో ఓ టైమ్ పీరియడ్, గెటప్ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా తీశానన్న నమ్మకం వుంది. మార్చిలో సినిమాని విడుదల చేస్తామని వర్మ చెప్పారు.