పెళ్లి చేసుకుంటే తాడుతో కట్టేసుకున్నట్లే : పూరి

Update: 2020-09-10 11:50 GMT
రామ్‌ గోపాల్‌ వర్మకు పెళ్లి అనే కాన్సెప్ట్‌ నచ్చదు. ఆ విషయం అందరికి తెల్సిందే. అందుకే ఆయన తన భార్య ను కుటుంబాన్ని వదిలేశాడు. పెళ్లి అనే దానిపై అస్సలు ఆసక్తిలేని రామ్‌ గోపాల్‌ వర్మ పెళ్లి అవసరమా అంటూ ఉంటాడు. తాజాగా ఆయన శిష్యుడు అయిన పూరి జగన్నాధ్‌ కూడా పెళ్లి అనేది పనికి రాని వ్యవస్థ అంటూ తీ్రవ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో పూరి జగన్నాద్‌ 'పూరి మ్యూజింగ్స్‌' పేరుతో ఆడియో మెసేజ్‌ లు ఇస్తున్నాడు. గత వారం పూరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విచిత్రమైన తెగల పద్దతులను వివరించాడు. తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి అనే పద్దతికి పోయే కాలం దగ్గర పడింది. గొప్ప వారు అవ్వాలనుకున్న వారు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. పెళ్లి అనేది అంత మంచిది అవ్వక పోవడం వల్లే ఏసుక్రీస్తు పది వివాహాలు చేసుకున్నారు. ఇక భార్యను వదిలేయడం వల్లే రాజుల వంశంకు చెందిన కుర్రాడు బుద్దుడు అయ్యాడు. ఇప్పుడు ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే తనను తాను తాడుతో కట్టేసుకోవడమే. పెళ్లి అనే తాడుతో కట్టేసుకోవడంతో గానుగ ఎద్దులా అక్కడక్కడే తిరుగుతూ ఉండాల్సిందే.

పట్టుదల అనేది మీకు ఉంటే కాళ్లకు పారాణి పెట్టుకోకుండా ప్రపంచ దేశాలు తిరగాలి. పెళ్లి చేసుకున్న వారు అంతా కూడా పెళ్లికాని బాబాల కాళ్లపై పడి దండం పెడుతున్నారు. పెళ్లి చేసుకున్న హీరోయిన్స్‌ ను కూడా ప్రేక్షకులు పట్టించుకోరు. పెళ్లి కాకుండా ఉన్న వారు అంతా గొప్ప వారినిగా పేరు సంపాదించారు అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు మీ పెళ్లి శుభలేక పంపండి నేను వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడు. పూరి వ్యాఖ్యలను కొద్ది మంది సమర్థిస్తే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News