తనను టార్గెట్ చేసేందుకు కొన్ని మీడియా చానెళ్లు కుట్ర పన్నాయని, శ్రీనిరాజు ఆ కుట్రలో భాగస్వామి అని జనసేన అధినేత పవన్ నిన్న చేసిన ట్వీట్లు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. శ్రీనిరాజు తాజా ఫొటో ఇలా ఉంటుందని కూడా పవన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లకు గానూ తన పై శ్రీనిరాజు పరువునష్టం దావా వేయబోతున్నారని భావించిన పవన్ ....తన అభిమానులు సంయమనం కోల్పోవద్దని ట్వీట్లు పెట్టారు. తాజాగా, తనకు శ్రీనిరాజు లాయర్ పంపిన లీగల్ నోటీసులను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన తల్లిపై చేయించిన దారుణమైన కామెంట్లతో పోలిస్తే ఈ లీగల్ లెటర్ లెక్కలోది కాదని పవన్ అన్నారు.
తనపై, తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై...అందుకు ప్రేరేపించిన మీడియా చానెళ్లపై నిన్న పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెనుక కొన్ని చానెళ్లతోపాటు శ్రీని రాజు, మంత్రి లోకేశ్, రాంగోపాల్ వర్మ ఉన్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
తనపై ఆయన పరువు నష్టం దావా వేయబోతున్నారని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని పవన్ అన్నారు. కొంతమంది మీడియా చానళ్ల ముఖ్యులపై తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయబోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీనిరాజు పంపిన లీగల్ లెటర్ ను పవన్ ట్వీట్ చేశారు.
``శ్రీనిరాజు.... శ్రీసిటీతో మిమ్మల్ని ఆశీర్వదించిన మీ రాజకీయ నాయకులతో కుమ్మక్కయిన అసలు సిసలు అజ్ఞాతవాసి రవి ప్రకాష్ నా తల్లిపై మీ టీవీ9లో ప్రసారం చేసిన దారుణాలతో పోల్చితే మీ లీగల్ నోటీసు అసలు నాకు మ్యాటరే కాదు. గుడ్ లక్ శ్రీని.`` అని పవన్ ట్వీట్ చేశారు.
తనపై, తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై...అందుకు ప్రేరేపించిన మీడియా చానెళ్లపై నిన్న పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెనుక కొన్ని చానెళ్లతోపాటు శ్రీని రాజు, మంత్రి లోకేశ్, రాంగోపాల్ వర్మ ఉన్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
తనపై ఆయన పరువు నష్టం దావా వేయబోతున్నారని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని పవన్ అన్నారు. కొంతమంది మీడియా చానళ్ల ముఖ్యులపై తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయబోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీనిరాజు పంపిన లీగల్ లెటర్ ను పవన్ ట్వీట్ చేశారు.
``శ్రీనిరాజు.... శ్రీసిటీతో మిమ్మల్ని ఆశీర్వదించిన మీ రాజకీయ నాయకులతో కుమ్మక్కయిన అసలు సిసలు అజ్ఞాతవాసి రవి ప్రకాష్ నా తల్లిపై మీ టీవీ9లో ప్రసారం చేసిన దారుణాలతో పోల్చితే మీ లీగల్ నోటీసు అసలు నాకు మ్యాటరే కాదు. గుడ్ లక్ శ్రీని.`` అని పవన్ ట్వీట్ చేశారు.