ఇస్మార్ట్‌ హీరోయిన్‌ ను చూసి ఇతరులు నేర్చుకోవాల్సిందే

Update: 2021-06-19 09:30 GMT
సవ్యసాచి.. మిస్టర్ మజ్ను సినిమా ల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యంగా ఈమె పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా లో నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా నిధి అగర్వాల్‌ ఇప్పటికే పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ఇంకా తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.

వరుసగా సినిమా లు చేస్తూ బిజీగా ఉన్న నిధి అగర్వాల్‌ ఒక టీమ్‌ ను ఏర్పాటు చేసి తనకు తోచిన సాయంను చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనా సమయంలో ఎంతో మంది ఉపాది కోల్పోయి కనీసం తినడానికి కూడా అవస్థలు పడుతున్నారు. మరి కొందరు కరోనాతో చికిత్స కు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో తమకు తోచిన సాయంను చేసేందుకు సిద్దంగా ఉన్నామని.. తమ పోర్టర్ లో ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే సంప్రదించవచ్చు. తమ టీమ్ వారి విషయమై ఎంక్వౌరీ చేసి సాయం చేస్తుందని నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్‌ ఈమద్య కాలంలోనే హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఆమె తీసుకునే పారితోషికం కోట్లలో కూడా ఉండదు. అయినా కూడా ఆమె తనకు ఉన్నంతలో సాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. సినిమాకు రెండు మూడు కోట్లు అంతకు మించి తీసుకుంటున్న హీరోయిన్స్‌ ఇప్పటి వరకు కనీసం లక్షల్లో ఛారిటీ కి ఇచ్చిన దాఖలాలు లేవు. తమ వంతు సహకారం అందించేందుకు హీరోయిన్స్‌ ఎంత మంది వచ్చారు అంటే వెంటనే చెప్పడం కష్టమే. అలాంటిది నిధి అగర్వాల్‌ బాధ్యతతో సాయం చేసేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇతర హీరోయిన్స్‌ ఆమెను చూసి చాలా నేర్చుకోవాల్సిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News