బెల్లంకొండ హీరోకి మెహ్రీన్ జోడీ

Update: 2018-08-19 11:28 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాతో శ్రీనివాస్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే  ఒక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు నిర్మాతలు.  ఇక తాజా గా మరో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారట.
 
బెల్లంకొండ  శ్రీనివాస్ తో మొదటి సారిగా మెహ్రీన్ కౌర్ పీర్జాదా తో జతకట్టనున్నాడు. డైరెక్టర్ ఒక్కడే ఈ సినిమా కు కొత్త గానీ ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోయిన్లు టీం లో కి వచ్చారు.  ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లతో ఆడిపాడిన బెల్లంకొండ బాబు ఈసారి ఇద్దరు హీరోయిన్లను ఒకే సినిమాతో కవర్ చేయడం విశేషం.  ఇక ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముకేష్ - హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.

మరో వైపు ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో శ్రీనివాస్ పాత్ర ప్రయోగాత్మకంగా ఉంటుందని టాక్ ఉంది.  మరి తేజ ఈ బెల్లంకొండ బాబును ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News