మళ్లీ రికార్డుల వేటకు రెడీ అవుతున్న మలయాళ సూపర్ స్టార్

Update: 2020-11-25 04:15 GMT
దృశ్యం.. 2013లో చడీచప్పుడు లేకుండా వచ్చిన సినిమా. ఇదేమీ భారీ బడ్జెట్ మూవీ కూడా కాదు. మలయాళ థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. అప్పటి వరకూ మలయాళ సినిమాలు రూ. 30 కోట్లు కూడా వసూలు చేయని పరిస్థితి. కానీ దృశ్యం సినిమా తొలిసారి రూ. 50 కోట్లు వసూలు చేసి మలయాళం ఇండస్ట్రీ లో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ దృశ్యం -2తో మోహన్ లాల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అది తొందరలోనే విడుదల కాబోతోంది.

ఈలోగా మరో క్రేజీ కాంబినేషన్ కు మోహన్ లాల్ శ్రీకారం చుట్టారు. మన్యంపులికి మంచి కథ ఇచ్చిన ఉదయ్ కృష్ణన్ మోహన్ లాల్ కోసం మరో కథ సిద్ధం చేశాడు.మన్యంపులి సినిమాలో   మోహన్ లాల్  పులి తో చేసిన ఫైట్స్ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాయి. అన్ని భాషల్లో డబ్ అయి విడుదల అయిన ఆ  సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. కేరళలో  తొలి వంద కోట్ల వసూళ్లు చేసిన  సినిమాగా రికార్డులు నెలకొల్పింది.

 ప్రస్తుతం మోహన్ లాల్  ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో 'ఆరట్టు ' అనే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి విశేషం ఏమిటంటే మన్యం పులికి  కథ అందజేసిన ఉదయ్ కృష్ణన్ ఈ సినిమా కూడా స్క్రిప్ట్ అందజేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా  నటించనున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన మన్యంపులి సంచలన విజయం సాధించగా.. మళ్లీ ఆ సినిమాకు కథ అందించిన ఉదయ్ కృష్ణన్ తో కలసి మళ్లీ మోహన్ పని చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News