ఫస్ట్ లుక్: ఐటీ స్కామ్ లో చందమామ

Update: 2020-02-21 08:14 GMT
మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మోసగాళ్ళు'. సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు జెఫ్రీ చిన్.  మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు 'మోసగాళ్ళు' టీమ్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు 'అను' అంటూ వెల్లడించారు.  స్లీవ్ లెస్ బ్లేజర్ ధరించి.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్.. చేతికి వాచ్ తో ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తరహాలో నిలుచుంది.  ఈ సినిమా కథ ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ కు సంబంధించినదని పోస్టర్ లో కూడా చెప్పారు.  మరి బ్యూటిఫుల్ కాజల్ ఆ స్కామ్ లో పాత్రధారి.. సూత్రధారి అవుతుందా లేక స్కామ్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందా అనేది ఆసక్తికరం.

ఈమధ్యే 'మోసగాళ్ళు' టీమ్ అమెరికాలో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని వచ్చారని.. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం.  ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఎవీఎ ఎంటర్టైన్మెంట్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 
Tags:    

Similar News