3 నెలల్లో 3 సినిమాలతో దాడి

Update: 2017-04-23 05:11 GMT
మాస్ హీరో గోపీచంద్ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. 2015 చివరలో వచ్చిన సౌఖ్యం మూవీ నిరుత్సాహపరిచిన తర్వాత.. ఇప్పటివరకూ ఒక సినిమా కూడా విడుదల కాలేదు. అలాగని గోపీచంద్ ఖాళీగా ఏం లేడు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పడు అన్నీ కలిసి షార్ట్ గ్యాప్ లో జనాల ముందుకు వచ్చేయనున్నాయి.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో.. ఏఎం రత్నం నిర్మాణంలో 2015 చివర్లో షూటింగ్ ప్రారంభించుకున్న మూవీ ఆక్సిజన్. ఈ మూవీ షూటింగ్ ను గోపీచంద్ పూర్తి చేసి చాలా కాలం అయినా.. గ్రాఫిక్ వర్క్ కి టైం పట్టడంతో ఆలస్యమైపోయింది. ఈ ఆక్సిజన్ కు మే నెలలో ఊపిరిపోస్తామని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు నిర్మాత. దీనికంటే ముందు బి.గోపాల్ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రానికి.. ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్ తో కొత్తగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సెన్సార్ మినహా అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమాను కూడా మే నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు.

వీటితో పాటు మరో చిత్రం కూడా గోపీచంద్ చివరి దశకు తెచ్చేశాడు. గౌతమ్ నంద అంటూ సంపత్ నంది దర్శకత్వంలో చేసిన చిత్రం జూన్ చివరలో కానీ.. జూలై మొదట్లో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మాస్ రచ్చ విషయంలో సంపత్ నంది ట్యాలెంట్.. హన్సిక-కేథరిన్ ల అందాలు.. మాస్ హీరో గోపీచంద్ క్రేజ్.. ఈ మూవీపై హైప్ ను మరింతగా పెంచేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News