ఆ రోజున ఫిదా చేసేస్తారట!!

Update: 2017-06-24 04:57 GMT
ఒకానొక టైంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్రతీ ఒక్క స్టార్ హీరో కూడా ఆసక్తి చూపిన పరిస్థితి కనిపించింది. తర్వాత బాగా నెమ్మదించిన ఈయన చేసిన ప్రయోగాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు మెగాహీరో వరుణ్ తేజ్ తో ఫిదా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ఆడియన్స్ ను మిక్సెడ్ రియాక్షన్ వస్తోంది కానీ.. శేఖర్ కమ్ముల మార్క్ మూవీ అనే సంగతి తెలిసిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి కేరక్టర్ ను బేస్ చేసుకుని ఈ సినిమా కథ సాగనుందని చెప్పచ్చు. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు నిర్మాత దిల్ రాజు. జూలై 21న ఆడియన్స్ ను ప్రేమలో ముంచెత్తేలా.. ఫిదా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలంగాణ అమ్మాయికి.. ఎన్నారై కుర్రాడికి మధ్య నడిచే ప్రేమకథగా ఈ మూవీ రూపొందింది. నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ప్రతిష్టాత్మంగా నిర్మించగా.. ఈ చిత్రం హీరో.. హీరోయిన్.. దర్శకుడు ముగ్గురికీ కీలకం కావడం విశేషం.

మిస్టర్ తో పరాజయం మూట కట్టుకున్న వరుణ్ తేజ్.. మళ్లీ ట్రాక్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు.. ఫిదాతో టాలీవుడ్ అరంగేంట్రం చేస్తున్న మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి కూడా.. ఈ మూవీ సక్సెస్ పై ఎన్నో హోప్స్ తో ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News