అవతార్ పైనే బండ వేసిన కరోనా
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం అంతలాకుతలమవుతోంది. చైనాలో పుట్టి 160 దేశాలకు పాకింది వైరస్. ఆర్ధికంగాను అన్ని దేశాలు సంక్షోభంలో పడిపోతున్నాయి. అసలే ఆర్ధికంగా సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు కరోనా రాక మండే పుండు మీద కారం జల్లినట్లు చేసింది. అన్ని పరిశ్రమల్లానే వినోద పరిశ్రమను కరోనా కల్లోలం నిండా ముంచేస్తోంది. ముఖ్యంగా భారతీయ సినిమాపై ఇప్పటికే పెను ప్రభావం చూపుతోంది. అటు పాశ్చాత్య దేశాల్లో వైరస్ విస్త్రతి పెరుగుతుండడంతో హాలీవుడ్ సినిమాకు ముప్పు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే చాలా సినిమా షూటింగ్ లు అర్ధతరంగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. తాజాగా కరోనా దెబ్బ అవతార్-2కి గట్టిగానే తగిలినట్లుంది. అవతార్ తొలి భాగం సక్సెస్ అనంతరం ఈ ఫ్రాంఛైజీ నుంచి మరిన్ని సీక్వెల్స్ రానున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా మొత్తం నాలుగు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే అవతార్-2 చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సినిమాకు కీలకమైన విజువల్ గ్రాఫిక్స్ పనులు వివిధ దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీ నడుమ పూర్తిచేసే పనిలో ఉన్నారు. దర్శక దిగ్గజం జేమ్స్ కామోరూన్ బృందం. ఒక వైపు ఫ్రాంఛైజీలో తదుపరి భాగాల షూటింగ్ లు కొనసాగిస్తూనే.. మరో వైపు అవతార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయితే చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ ని భాగంగా న్యూజిలాండ్ లో చేయాల్సి ఉండగా కరోనా దెబ్బకి ఏ పనులు ముందుకు కదలడం లేదని కామోరూన్ తెలిపారు.
పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా తిరగడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో షూటింగ్ చేయడానికి వీలు లేకుండా పోతుందిట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని తెలిపారు. విమానాయన సంస్థలు అన్ని రకాల ఎయిర్ లైన్స్ ను రద్దు చేయడంతో అమెరికాలోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. న్యూజిలాండ్ లో అన్ని రోడ్లు బ్లాక్ అయ్యాయని అన్నారు. అవతార్-2 సినిమాకు సంబంధించిన మార్కెట్ పైనే ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను అన్ని పనులు పూర్తిచేసి ఈ ఏడాది విడుదల చేయాల్సి ఉంది.
కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సినిమా విడుదలవ్వడం కష్టమని యూనిట్ భావిస్తోంది. మిగతా భాగాలను వరుసగా 2023..2025..2027లోరిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా దెబ్బకి ఈ మొత్తం ఆర్డరే మారిపోయేలా కనిపిస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని.. తమ సినిమా డిలే అవుతుందని చింతించడం లేదని కామెరూన్ మీడియాకి తెలిపారు.
దీనిలో భాగంగా మొత్తం నాలుగు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే అవతార్-2 చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సినిమాకు కీలకమైన విజువల్ గ్రాఫిక్స్ పనులు వివిధ దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీ నడుమ పూర్తిచేసే పనిలో ఉన్నారు. దర్శక దిగ్గజం జేమ్స్ కామోరూన్ బృందం. ఒక వైపు ఫ్రాంఛైజీలో తదుపరి భాగాల షూటింగ్ లు కొనసాగిస్తూనే.. మరో వైపు అవతార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయితే చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ ని భాగంగా న్యూజిలాండ్ లో చేయాల్సి ఉండగా కరోనా దెబ్బకి ఏ పనులు ముందుకు కదలడం లేదని కామోరూన్ తెలిపారు.
పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా తిరగడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో షూటింగ్ చేయడానికి వీలు లేకుండా పోతుందిట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయని తెలిపారు. విమానాయన సంస్థలు అన్ని రకాల ఎయిర్ లైన్స్ ను రద్దు చేయడంతో అమెరికాలోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. న్యూజిలాండ్ లో అన్ని రోడ్లు బ్లాక్ అయ్యాయని అన్నారు. అవతార్-2 సినిమాకు సంబంధించిన మార్కెట్ పైనే ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను అన్ని పనులు పూర్తిచేసి ఈ ఏడాది విడుదల చేయాల్సి ఉంది.
కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సినిమా విడుదలవ్వడం కష్టమని యూనిట్ భావిస్తోంది. మిగతా భాగాలను వరుసగా 2023..2025..2027లోరిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా దెబ్బకి ఈ మొత్తం ఆర్డరే మారిపోయేలా కనిపిస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని.. తమ సినిమా డిలే అవుతుందని చింతించడం లేదని కామెరూన్ మీడియాకి తెలిపారు.